E-Paper
Advertisement

TTD: డిసెంబర్‌లో తిరుపతి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ విషయం తెలుసా..??

TTD: డిసెంబర్‌లో తిరుపతి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ విషయం తెలుసా..??
Advertisement

Srivari Seva tickets release dates: చాలామందికి తిరుపతి వెళ్లి అక్కడ శ్రీవారి ఆర్జిత సేవలో పాల్గొని ఉంటుంది. ఇందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంటారు. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా కీలక ప్రకనట చేసింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 18న బుధవారం రోజున విడుదల చేస్తామని చెప్పింది. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తామంటూ టీటీడీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 20 ఉదయం 10 గంటలకు వరకు నమోదు చేసుకోవొచ్చని సూచించింది. అది కూడా ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. కాగా, ఈ టికెట్లను పొందిన భక్తులు ఈ నెల 20 నుంచి 22 వరకు మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లించినవారికే లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయంటూ టీటీడీ వెల్లడించింది.

Also Read: బ్రేకింగ్ న్యూస్.. ప్రతి ఇంటికీ రూ. 25 వేల ఆర్థికసాయం ప్రకటించిన ప్రభుత్వం

Advertisement

ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను కూడా ఈ నెల 21న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనున్నది. ఇటు వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించి కూడా డిసెంబర్ నెలా కోటా టికెట్లను ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నది.

డిసెంబర్ నెల కోటాకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించి కూడా ఆన్ లైన్ లో ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఇటు దివ్యాంగులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబర్ నెల ఫ్రీ దర్శనం టోకెన్ల కోటాను కూడా ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించింది. అదేవిధంగా 24న డిసెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను కూడా విడుదల చేయనున్నది టీటీడీ.

Advertisement

ఇటు తిరుమల, తిరుపతిలో గదుల కోటా.. డిసెంబర్ నెలకు సంబంధించి కూడా ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది.

Also Read: ఒక్క ‘సాక్షి’కే రూ.300 కోట్లా? అంటే ఐదేళ్లలో..? అయ్య బాబోయ్, జగన్ మామూలోడు కాదు!

ఇదిలా ఉంటే.. తిరుమల, తిరుపతి శ్రీవారి సేవా కోటా ఈ నెల 27న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది. నవనీత సేవకు సంబంధించి మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తామంటూ వివరించింది. పరకామణి సేవకు సంబంధించి మధ్యాహ్నం 1 గంటకు ఆన్ లైన్ లో విడుదల చేస్తామని టీటీడీ తెలిపింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ ఈ మేరకు విజ్ఞప్తి చేసింది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×