E-Paper
Advertisement

Tirumala Tickets 2024: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నేడు ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శన టికెట్లు విడుదల..

Tirumala Tickets 2024: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నేడు ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శన టికెట్లు విడుదల..
Advertisement

Tirumala Tickets 2024: మీరు ఫిబ్రవరి నెలలో తిరుమల శ్రీవారిని దర్శించాలని అనుకుంటున్నారా.. దర్శనం టికెట్లను స్వీకరించాలా అయితే మీలాంటి భక్తుల కోసం టీటీడీ నేడు ఆన్లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్లను విడుదల చేయనుంది.

టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు భాద్యతలు స్వీకరించిన సమయం నుండి పాలనా అంశాలపై పట్టు సాధిస్తున్నారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు స్వామి వారిని తక్కువ సమయంలోనే దర్శించేలా ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసేందుకు సైతం చైర్మన్, అధికారులతో చర్చలు జరుపుతున్నారు. తిరుమల పవిత్రతను కాపాడడంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా, ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు.

Advertisement

తిరుమల శ్రీవారి దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాక, దేశ విదేశాల నుండి సైతం భక్తులు తరలివస్తారు. పలువురు భక్తులు ఆన్లైన్ విధానం ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లను స్వీకరిస్తారు. అటువంటి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ ద్వారా టికెట్లను అందించే కార్యక్రమాన్ని ప్రతినెలా నిర్వహిస్తుంది.

తాజాగా నేడు ఆన్లైన్ ద్వారా శ్రీవారి దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి నెల కు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. అలాగే ఈనెల 20వ తేదీన లక్కీ డిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపును సైతం నిర్వహించనున్నారు. నేటి ఉదయం పది గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆర్జిత సేవ టికెట్లకై రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. మరెందుకు ఆలస్యం శ్రీవారి దర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా స్వీకరించండి.

Advertisement

తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ప‌రేడ్ మైదానంలో నవంబరు 18వ తేదీ రాత్రి నిర్వహించనున్న కార్తీక మ‌హాదీపోత్సవానికి టిటిడి చేపట్టిన విస్తృత ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. హెచ్ డీపీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక మహా దీపోత్సవానికి భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని టిటిడి కోరుతోంది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందించనున్నారు.

ఇందులో భాగంగా మ‌హిళ‌లు కూర్చుని దీపాలు వెలిగించేలా దీప‌పు దిమ్మెలు, నేతి వ‌త్తులు ఏర్పాటు చేస్తున్నారు. మైదానం మొత్తం తివాచీలు, ఒక్కో దీపపు దిమ్మె వ‌ద్ద తుల‌సి మొక్కను ఉంచనున్నారు. కార్యక్రమం అనంత‌రం మ‌హిళ‌లకు ఈ మొక్కల‌ను అందిస్తారు. వేదిక‌ను శోభాయ‌మానంగా పుష్పాల‌తో, విద్యుత్ దీపాలు, వేదిక ఇరువైపులా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సెట్టింగ్ లు ఏర్పాటు చేస్తున్నారు.

Also Read: మధిరలో ప్రత్యక్షమైన లేడీ అఘోరీ.. అక్కడ ఎవరిని కలిశారో తెలిస్తే.. షాక్ కావాల్సిందే!

కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న శ్రీ మ‌హాల‌క్ష్మీపూజ‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ప్రధాన ద్వారాల నుంచి ఆవ‌ర‌ణం మొత్తం అర‌టి చెట్లు, పూలు, విద్యుద్దీపాల‌తో అలంకరించనున్నారు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మైదానంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×