E-Paper
Advertisement

Tirumala Ghee Case Updates: తిరుమల కల్తీ నెయ్యి కేసు.. అప్రూవర్లలో డైయిరీ నిపుణుడు, సైంటిస్ట్

Tirumala Ghee Case Updates: తిరుమల కల్తీ నెయ్యి కేసు.. అప్రూవర్లలో డైయిరీ నిపుణుడు, సైంటిస్ట్
Advertisement

Tirumala Ghee Case Updates: తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఏం జరగనుంది? ముగ్గురు వ్యక్తులు అప్రూవర్‌గా మారారా? డైయిరీ నిపుణుడు, ఓ సైంటిస్టు కూడా ఉన్నారా? రేపో మాపో కొందరు నేతలు, అధికారులు అరెస్టు కావడం ఖాయమా? సిట్ నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగిందా? రెండువారాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

తిరుమల కల్తీ నెయ్యి కేసు.. అప్రూవర్‌గా డైయిరీ నిపుణుడు

Advertisement

ఏపీలో రాజకీయాలు తిరుమల లడ్డూ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ విషయంలో అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఫలితంగా వైసీపీ నేత అంబటి రాంబాబు అరెస్టు చేశారు. తాజాగా తిరుమల లడ్డూ కేసు గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కల్తీ నెయ్యి కేసులో ముగ్గురు వ్యక్తులు అప్రూవర్లగా మారారు.

నిందితుల్లో డెయిరీ ఎక్స్‌పర్ట్‌ డాక్టర్‌ సురేంద్రనాథ్‌ ఉన్నారు.  ఆ ముగ్గురు తాము చేసిన నేరాన్ని కోర్టులో అంగీకరించారు.  తిరుమలలో దర్శనాలు, వసతి ఏర్పాట్లలో ప్రొటోకాల్‌ మర్యాదలు చేశారు ఆనాటి ప్రభుత్వంలో కొందరు వ్యక్తులు. వారి మర్యాదలకు ఫిదా అయిపోయి కల్తీ నెయ్యి వ్యవహారంలో సహకరించినట్టు స్వయంగా న్యాయస్థానం ఎదుట అంగీకరించారు.

Advertisement

న్యాయస్థానం ముందు నేరాన్ని అంగీకరించిన నిందితులు

అప్రూవర్‌గా మారిన డెయిరీ ఎక్స్‌పర్ట్‌ డాక్టర్‌ బత్తల సురేంద్రనాథ్‌. ఆయన డిసెంబరు మొదటి వారంలో న్యాయస్థానం ముందు హాజరై మొత్తమంతా పూసగుచ్చినట్టు వివరించారు. నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన కెమిస్ట్రీ విభాగం సైంటిస్ట్ డాక్టర్ సురేంద్రనాథ్‌. టీటీడీ ప్లాంట్‌ ఇన్‌స్పెక్షన్‌ కమిటీలో నెయ్యి నిపుణుడిగా పని చేసిన ఆయన, సామర్థ్యం లేకున్నా డెయిరీలకు అనుకూల నివేదికలు ఇచ్చారు.

భోలేబాబా డెయిరీ ఉద్యోగి ఆశిష్‌ రోహిలా కూడా చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఆశిష్‌ రోహిలా ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా డెయిరీ ఉద్యోగి. అతడు పని చేసిన కాలంలో కల్తీ నెయ్యి దందా జరిగింది. ఏయే రసాయనాలు ఎంతెంత పరిమాణంలో వచ్చాయి, వాటితో కల్తీ ఎలా చేశారు వంటివి కోర్టుకు తెలియజేశాడు.

ALSO READ: విశాఖలో బాంబు కలకలం.. చెత్తకుప్పలో లైట్లు వెలుతురు చూసి హంగామా, చివరికి..

మూడో వ్యక్తి మహేశ్‌ కుమార్‌ రోహిరా రసాయనాలు సరఫరా చేసే వ్యాపారి. నగదు లావాదేవీల వివరాలను బయటపెట్టి కోర్టు ముందు ఒప్పుకొన్నాడు.  కల్తీ నెయ్యి విధానం గురించి మొత్తం కోర్టుకు వెల్లడించారు. ఈ కేసు చార్జిషీట్‌లో మొత్తం 36 మంది నిందితులుగా ఉన్నారు. అందులో ముగ్గురు అప్రూవర్లుగా మారారు. నిందితుల్లో డెయిరీ సంస్థలకు చెందినవారు ఐదుగురు ఉన్నారు. 31 మంది నిందితులు ఉన్నారు.

అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది సిట్. మరోసారి ఈ వ్యవహారంపై ఓ కమిటీ వేసింది ప్రభుత్వం. దీనిపై వారం లేదా రెండు వారాల్లో ఆ కమిటీ నివేదిక ఇవ్వనుంది. దాని ఆధారంగా చర్యలు చేపట్టనుంది. అధికారులతోపాటు కొందరు నేతలపై చర్యలు తీసుకోవచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×