E-Paper
Advertisement

Eluru : అమాయకులే టార్గెట్.. ఏటీఎం కార్డు మార్చి .. లక్షల కాజేసి.. నయా మోసం..

Eluru :  అమాయకులే టార్గెట్.. ఏటీఎం కార్డు మార్చి ..  లక్షల కాజేసి.. నయా మోసం..
Advertisement

Eluru : ఏటీఎం కార్డు మార్చి నగదు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని లక్క వరం గ్రామానికి చెందిన చందమాల మంగాదేవి అనే మహిళకు స్థానిక యూనియన్ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ నెల 14న తన ఏటీఎం కార్డును భర్త అరుణ్ కుమార్ కు ఇచ్చి నగదు తీసుకురమ్మని చెప్పింది.

జంగారెడ్డిగూడెం పట్టణం బుట్టాయగూడెం రోడ్డులో ఉన్న ఓ ఏటీఎంకు వెళ్లి నగదు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అక్కడ ఉన్న ఓ అపరిచిత వ్యక్తిని సహాయం కోరాడు. అతను ఏటీఎం నుంచి రూ.5 వేలు తీసి ఇచ్చాడు. అరుణ్ కు ఆ వ్యక్తి వేరే ఏటీఎం కార్డు ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పలు దఫాలుగా మంగాదేవి ఖాతా నుంచి రూ.1.86 లక్షలు మాయమయ్యాయి.

Advertisement

ఈ విషయం తెలియని బాధిత కుటుంబం సోమవారం నగదు తీసుకునేందుకు సంబంధిత బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు అధికారులు ఏటీఎం కార్డు మారిందని చెప్పారు. ఖాతాలో సొమ్ము మాయమైనట్లు గుర్తించడంతో అరుణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×