E-Paper
Advertisement

AP Elections: ఏపీలో ముగిసిన నామినేషన్లు.. రేపటి నుంచే పరిశీలన

AP Elections: ఏపీలో ముగిసిన నామినేషన్లు.. రేపటి నుంచే పరిశీలన
Advertisement

AP Elections 2024:రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలతో లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ గడువు ముగిసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. చిన్న చిన్న ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాలకు గాను 731 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను 4,210 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈనెల 29వ తేదీ వరకు నామినేషన్లకు ఉపసంహరణకు అవకాశం ఉంది.

Advertisement

కాగా, రేపటి నుంచి మూడు రోజుల పాటు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగనుంది. అయితే మే 13న ఒకే విడతలో రాష్ట్రవ్యాప్తంగా లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అయితే జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ఈసీ అధికారికంగా వెల్లడించనుంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×