E-Paper
Advertisement

Pulivendula: పులివెందులలో టీడీపీ జెండా రెపరెపలు.. లతా రెడ్డి ఘన విజయం, డిపాజిట్ కోల్పోయిన వైసీపీ

Pulivendula: పులివెందులలో టీడీపీ జెండా రెపరెపలు.. లతా రెడ్డి ఘన విజయం, డిపాజిట్ కోల్పోయిన వైసీపీ
Advertisement

Pulivendula: మూడు దశాబ్దాలపాటు పదిలంగా ఉన్న పులివెందుల జగన్ కోట బద్దలైంది. తొలిసారి ఆ కోటలో టీడీపీ జెండా రెపరెపలాడింది. జెడ్పీటీసీ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని చివరివరకు తీవ్ర ప్రయత్నాలు చేసింది వైసీపీ. దాదాపు 30 ఏళ్లుగా పోటీ లేకుండా ఏకగ్రీవం చేసుకుంటూ వచ్చింది. చివరకు ఈసారి ఎన్నికల్లో చిత్తయ్యింది.

తొలిసారి పోలీసులు తమ అధికారాలను ఉపయోగించి అధికార-విపక్షాల నేతలను అరెస్టు చేసి ప్రశాంతంగా ఎన్నికలు జరిపించారు. ఈ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి  6 వేల పైచిలుకు మెజార్టీతో ఘన విజయం సాధించారు.  వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌రెడ్డి పత్తా లేకుండా పోయారు.

Advertisement

పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నుంచి అధికార టీడీపీ-వైసీపీ మధ్య రాజకీయాలు ఆసక్తికరంగా సాగాయి. ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ ముందుకు అడుగులు వేశారు ఇరుపార్టీల నేతలు. నోటిఫికేషన్ విడుదలైన నాటికి సీఎం చంద్రబాబు టీమ్ సింగపూర్‌లో పర్యటిస్తోంది.

అనుహ్యంగా ముగ్గురు మంత్రులు రంగంలోకి దిగిన అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందని జిల్లా నాయకులతో మంతనాలు జరిపారు. చివరకు పులివెందుల నుంచి టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి భార్య లతారెడ్డి అయితే బాగుంటుందని ఓ అంచనాకు వచ్చారు. వెంటనే పార్టీ హైకమాండ్ ఓకే చేయడం, నామినేషన్ వేయడం చకచకా జరిగిపోయింది.

Advertisement

ALSO READ: కాంగ్రెస్ నుంచి జగన్ కు సంకేతాలు, షర్మిలతో చేతులు కలుపుతారా?

ఈలోగా వైసీపీలోని అసంతృప్తులను తనవైపు తిప్పుకున్నారు బీటెక్ రవి. అటు జమ్మలమగుడు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి- బీటెక్ రవి జెడ్పీటీసీ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. స్థానికుల నుంచి మాంచి స్పందన వచ్చింది. ప్రజల నుంచి వచ్చిన స్పందన గమనించిన టీడీపీ నేతలు గెలుపు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

పోలింగ్ రోజు పోలీసులు పూర్తిస్థాయిలో తమ అధికారాలను ఉపయోగించారు. అధికార-విపక్షాల నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. చివరకు రాయలసీమ డీఐజీ అక్కడి వచ్చారంటే అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

మంగళవారం జరిగిన ఎన్నిక పోలింగ్‌ జరగ్గా, గురువారం ఉదయం ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6,716 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 682 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో లతారెడ్డి 6,033 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గట్టి పోటీ ఇస్తుందని భావించిన వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి పత్తా లేకుండా పోయారు. చివరకు డిపాజిట్‌ కోల్పోయారు.

వైసీపీకి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. మూడు దశాబ్దాలుగా ఏకగ్రీవం చేసుకున్న వైసీపీకి కేవలం మూడంకెల ఓట్లు వచ్చాయి. ఆ పార్టీపై అక్కడి ప్రజల్లో తమకున్న ఆగ్రహాన్ని ఓటు ద్వారా తెలియజేశారు.  స్వతంత్రులు, కాంగ్రెస్ అభ్యర్థికి 239 ఓట్లు వచ్చాయి.

పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు మంత్రి సవిత. స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందే ఆ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ కోటను నిర్వీర్యం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సదరు మంత్రి. మరోవైపు ఒంటిమిట్ట జెడ్పీటీపీని టీడీపీ గెలుచుకుంది. అక్కడ టీడీపీకి 12,519  ఓట్లు రాగా,  వైసీపీకి 6298 ఓట్లు వచ్చాయి. ఇతరులకు 268 ఓట్లు వచ్చాయి.  దీంతో టీడీపీ అభ్యర్థి 6221 ఓట్లు తేడాతో విజయం సాధించారు.

 

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×