E-Paper
Advertisement

Kondapi : టీడీపీ ఎమ్మెల్యే Vs వైసీపీ ఇన్‌ఛార్జ్‌.. కొండపిలో హైటెన్షన్..

Kondapi : టీడీపీ ఎమ్మెల్యే Vs వైసీపీ ఇన్‌ఛార్జ్‌.. కొండపిలో హైటెన్షన్..
Advertisement

Kondapi : ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాయుడుపాలెంలోని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఇంటి ముట్టడికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించేందుకు టంగుటూరులోని వైసీపీ కార్యాలయానికి వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితులను కంట్రోల్ చేసేందుకు
350 మంది పోలీసులను అక్కడ మోహరించారు.

Advertisement

మరోవైపు వైసీపీ తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు కౌంటర్ గా నిరసనకు ప్రయత్నించారు.
టంగుటూరులోని వరికూటి అశోక్‌బాబు ఇంటి ముట్టడికి ఎమ్మెల్యే డోలా
ఆధ్వర్యంలో భారీగా టీడీపీ కార్యకర్తలు బయలుదేరారు. మార్గంమధ్యలో 16వ నంబర్‌ జాతీయ రహదారిపై పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఈ సమయంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి రోడ్డుపైనే
బైఠాయించారు. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×