E-Paper
Advertisement

Appalanaidu On Jagan: జగన్ కుట్రలు బట్టబయలు చేసిన టీడీపీ ఎంపీ! లడ్డూ కల్తీ నుంచి హెరిటేజ్ అటాక్ వరకు.. అసలు నిజాలివే!

Appalanaidu On Jagan: జగన్ కుట్రలు బట్టబయలు చేసిన టీడీపీ ఎంపీ! లడ్డూ కల్తీ నుంచి హెరిటేజ్ అటాక్ వరకు.. అసలు నిజాలివే!
Advertisement

Appalanaidu On Jagan: టీడీపీ ఎంపీ అప్పలనాయుడు ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం అన్ని ఆధారాలను బయటపెట్టిందని.. ఈ విషయంలో జగన్ తన తప్పును ఒప్పుకోకుండా ఎదురుదాడి చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు.

హెరిటేజ్ సంస్థ జగన్ కంపెనీల మాదిరిగా అక్రమ మార్గాల్లో పుట్టింది కాదని అప్పలనాయుడు స్పష్టం చేశారు. ఎంతో మంది మేధావుల ప్రశంసలు పొందిన హెరిటేజ్ సంస్థపై జగన్ బురద జల్లడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. నారా భువనేశ్వరి నాయకత్వంలో ఈ సంస్థ పారదర్శకంగా నడుస్తోందని.. గతంలో ఆమె ప్రజలను చైతన్యం చేస్తూ పర్యటించినందుకే కక్ష పూరితంగా జగన్ హెరిటేజ్ సంస్థను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్న సంస్థపై కుట్రలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

Advertisement

హిందువుల మనోభావాలను గత వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని.. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని అప్పలనాయుడు తెలిపారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన కొత్త రాజకీయ సంస్కృతి గురించి ప్రస్తావిస్తూ.. ప్రత్యర్థి పార్టీల నేతల కుటుంబ సభ్యులతో కూడా గౌరవంగా మాట్లాడే సంస్కృతిని లోకేష్ తీసుకొచ్చారని.. జగన్ పాలనలో ఇలాంటి గౌరవం ఎప్పుడైనా ఉందా అని ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ నాలుగు గోడలకే పరిమితమై.. అక్కడ ఎవరో చెప్పిన విషయాలను పట్టుకుని గంటల తరబడి మీడియా ముందు మాట్లాడుతుంటారని ఎద్దేవా చేశారు. ప్రజలతో మమేకం కావడం కానీ.. కనీసం క్రికెట్ వంటి క్రీడలను ఆస్వాదించడం కానీ జగన్ వల్ల కాదని ఆయన మనస్తత్వం ఎప్పుడూ కుట్రలు, రాజకీయ లబ్ధి చుట్టూనే తిరుగుతుందని ఎంపీ అప్పలనాయుడు విమర్శించారు.

Advertisement

Also Read: రెండు నెలల పసికందు సజీవ దహనం.. ఆ తల్లి చేసిన పనికి కంగుతిన్న పోలీసులు!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×