E-Paper
Advertisement

TDP : మంత్రి ఇలాకాలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. ఎంపీ, ఎమ్మెల్యే నిరసన.. ఎందుకంటే..?

TDP : మంత్రి ఇలాకాలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. ఎంపీ, ఎమ్మెల్యే నిరసన.. ఎందుకంటే..?
Advertisement

TDP : శ్రీకాకుళం జిల్లా పలాస- కాశీబుగ్గలో శనివారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ పట్టణ అధ్యక్షుడి ఇంటి ముందు కల్వర్టు కూల్చివేతకు అధికారులు ప్రయత్నించడం వివాదానికి దారితీసింది. టీడీపీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు 15 ఏళ్ల క్రితం తన ఇంటికి రహదారి నిర్మించుకున్నారు. ఈ దారిలో సాగునీటి కాలువపై కల్వర్టు నిర్మించారు. ఈ నిర్మాణం అక్రమం అంటూ తొలగించేందుకు అధికారులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

కల్వర్టు వల్ల నీటి ప్రవాహానికి ఎలాంటి ఇబ్బందులు లేదని నాగరాజు అంటున్నారు. కానీ ఉద్దేశపూర్వకంగా కల్వర్టును తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారని మండిపడ్డారు. ఆయనకు సంఘీభావంగా ఘటనా స్థలానికి ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, భారీగా నాయకులు, కార్యకర్తలు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ నేతలు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో భారీగా పోలీసులను మోహరించారు.

Advertisement

కల్వర్టు కూల్చివేతపై అధికారులు, టీడీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ నుంచి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మంత్రి సీదిరి అప్పలరాజుపై టీడీపీ నేత నాగరాజు తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి ఆదేశాలతో అధికారులు కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×