E-Paper
Advertisement

Rajahmundry : టీడీపీ, జనసేన కీలక భేటీ.. ఎజెండా ఇదేనా..?

Rajahmundry : టీడీపీ, జనసేన కీలక భేటీ.. ఎజెండా ఇదేనా..?
Advertisement

Rajahmundry : 44 రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లోనే ఉన్నారు. ఆయన భార్య నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే రాజమండ్రిలోని ఓ హోటల్‌లో టీడీపీ జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, నారా లోకేశ్‌ పాల్గొంటారని తెలుస్తోంది. వీరితోపాటు ఇరు పార్టీల నుంచి 14 మంది కమిటీ సభ్యులు సైతం హాజరుకానున్నారు. జనసేన, టీడీపీ ఉమ్మడి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సాధ్యమైనంత ఎక్కువగా ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించాలని టీడీపీ, జనసేన నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడిగా ఉద్యమాలు కొనసాగిస్తూనే ఎవరికివారు పార్టీలపరంగా ప్రజల్లోకి వెళ్లే యోచనలో ఉన్నారు. మరి సీట్ల పంపకాలపై ఏమైనా చర్చ జరుగుతుందనే ఆసక్తి నెలకొంది.

Advertisement

మరోవైపు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెబుతూ జైలు నుంచే ‌చంద్రబాబు లేఖ విడుదల చేశారంటూ వచ్చిన వార్తలపై జైలు సూపరింటెండెంట్‌ వివరణ ఇచ్చారు. జైలు నుంచి ఎటువంటి లేఖ విడుదల కాలేదని స్పష్టం చేశారు. జైలు నిబంధనల ప్రకారం జైలు నుంచి లేఖ విడుదల అయితే సంబంధిత అధికారి సంతకం ఉంటుందని వెల్లడించారు. ఇంకోవైపు ములాఖత్‌లో కుటుంబ సభ్యులు కలిసినప్పుడు వారి ద్వారా చంద్రబాబు లేఖ విడుదల చేశారని టీడీపీ నేతల చెబుతున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×