E-Paper
Advertisement

TDP Janasena : చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ.. జనసేనకు ఎన్నంటే?

TDP Janasena : చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ.. జనసేనకు ఎన్నంటే?
Advertisement
TDP Janasena News

TDP Janasena News(AP political news):

టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కలిశారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. దాదాపు గంటన్నరపాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారని తెలుస్తోంది.

టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఇప్పటికే పొత్తు కుదిరింది. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాలపై చంద్రబాబు, పవన్ చర్చించారని తెలుస్తోంది. 40 నుంచి 42 వరకు సీట్లు పవన్ కల్యాణ్ అడిగారని సమాచారం. 25 నుంచి 30 సీట్లు ఇచ్చే యోచనలో టీడీపీ అధినేత ఉన్నారంటున్నారు. 5 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని జనసేనాని భావిస్తున్నారని తెలుస్తోంది. 2 లోక్ సభ సీట్లు ఇచ్చే ఆలోచనలో టీడీపీ ఉందంటున్నారు. డిసెంబర్ చివరి నాటికి అభ్యర్థుల ఎంపిక చేయాలని భావిస్తున్నారని టాక్.

Advertisement

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేసే అంశంపైనా చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించారని తెలుస్తోంది. తటస్థలు , వైసీపీ నేతలు జనసేనలో చేరికపై చర్చించారట. సమన్వయ కమిటీ సమావేశంలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టో విడుదలపై నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

ఏపీలో త్వరలో 3 చోట్ల ఉమ్మడిగా బహిరంగ సభలు నిర్వహించాలని బాబు-పవన్ భావిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికలపైనా చర్చించారని సమాచారం.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×