E-Paper
Advertisement

YSRCP Compare BRS: గంటా సంకేతాలు.. ఎన్నికల తర్వాత అదే పరిస్థితి..?

YSRCP Compare BRS: గంటా సంకేతాలు.. ఎన్నికల తర్వాత అదే పరిస్థితి..?
Advertisement

YSRCP Compare BRS: వైసీపీ అధినేత జగన్ బస్సుయాత్ర ఉమ్మడి విశాఖకు చేరుకుంది. ఈ క్రమంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సీఎం జగన్‌‌పై విమర్శలు మొదలుపెట్టేశారు టీడీపీ సీనియర్లు. ఈ జాబితాలోని ముందు వరుసలో ఉంటారు మాజీ మంత్రి, భీమిలి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు.

ఎన్నికల వేళ వైసీపీ పరిస్థితి దారుణంగా ఉందన్నారు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు. ముఖ్యంగా వివిధ జిల్లాలు, నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున వైసీపీ నేతలు, కేడర్ టీడీపీలోకి చేరుతోందన్నారు. ఈలెక్కన ఫ్యాన్ పార్టీ రోజురోజుకూ దిగజారుతోందని ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా సీఎం జగన్ వ్యవహారశైలి నచ్చక చాలామంది నేతలు సైతం టీడీపీలోకి వస్తున్నారని తెలిపారు.

Advertisement

విశాఖలోని మధురవాడలో పార్టీ ఆఫీసును గంటా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, పదేళ్లపాటు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అస్సలు ఊహించు కోలేమన్నారు. ఎన్నికల తర్వాత వైసీపీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుందని మనసులోని మాట బయటపెట్టారు. బీఆర్ఎస్ పార్టీలో నేతలు ఉండలేక అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ వైపు వెళ్లిపోతున్నారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో వైసీపీకీ అదే పరిస్థితి ఖాయమన్నారు.

Also Read: సీఎం జగన్‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు..

Advertisement

ఉన్నట్లుండి గంటా వ్యాఖ్యలపై వైసీపీ నేతల్లో చర్చ జరుగుతోంది. సీఎం జగన్ బస్సుయాత్ర విశాఖకు వస్తోందని, కావాలని తమ అధినేతను టార్గెట్ చేశారని గుర్తు చేస్తున్నారు. అయినా గంటాను ఆపార్టీలో పట్టించుకునే కరువయ్యారని అంటున్నారు. గంటాకు సీఎం జగన్ సరైన కౌంటర్ ఇస్తారని అంటున్నారు. అటు టీడీపీ నేతలు మాత్రం గంటా వ్యాఖ్యలకు మద్దతు పలుకుతున్నారు.

ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏపీకి ఏం చేసిందని ప్రశ్నిస్తున్నవాళ్లూ లేకపోలేదు. ప్రభుత్వం భూములు అమ్మేయడం, భూముల విలువ పెంచడం తప్ప అధికార పార్టీ ఏం చేసిందనేది టీడీపీ నేతల వాదన. పనిలోపనిగా మాజీమంత్రి భీమిలి వైసీపీ అభ్యర్థి, తన శిష్యుడు అవంతిపైనా విమర్శలు ఎక్కుపెట్టారు గంటా శ్రీనివాసరావు. ఫోన్లు చేసి బెదిరిస్తే.. పార్టీలోకి ఎవరు చేరుతారని ప్రశ్నించారు. గంటా వ్యాఖ్యాలతో విశాఖలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×