E-Paper
Advertisement

TDP Counter to YSRCP: అప్పట్లో ఏం జరిగింది..? బయటకొస్తున్న పాత వీడియోలు

TDP Counter to YSRCP: అప్పట్లో ఏం జరిగింది..? బయటకొస్తున్న పాత వీడియోలు
Advertisement

పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలు, వాటికి కౌంటర్ గా ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలు.. ఇలా ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆగేలా లేదు. టీడీపీ నేతలు కూడా గతంలో వైసీపీ వాళ్లు చేసిన దారుణమైన వ్యాఖ్యల్ని బయటకు తీస్తున్నారు. ఆనాడు అసెంబ్లీలోనే మహిళలపై దారుణ వ్యాఖ్యలు చేసిన వారిని ఈరోజు ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యల్ని పార్టీలకతీతంగా అందరూ ఖండించారు. అతను క్షమాపణ వీడియో వెంటనే విడుదల చేసినా అప్పటికే తప్పు జరిగింది కాబట్టి, టీడీపీ కూడా ఆ తప్పుని ఉపేక్షించలేదు. పార్టీనుంచి సస్పెండ్ చేయడమే కాకుండా పోలీస్ కేసు కూడా పెట్టాలని స్వయంగా పార్టీయే ఫిర్యాదు చేయడం ఇక్కడ విశేషం. దీంతో ఇప్పుడు బంతి టీడీపీ కోర్టులోకి వచ్చినట్టయింది. తమ చిత్తశుద్ధి ఏంటో చూశారుగా అంటూ టీడీపీ నేతలు తిరిగి వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ఇదే పని వైసీపీలో ఎవరైనా చేసి ఉంటే.. వారికి జగన్ సలహాదారు పదవో లేక సోషల్ మీడియా ఇన్ చార్జ్ పదవో, మంత్రి పదవో ఇచ్చి ఉండేవారని అంటున్నారు టీడీపీ

Advertisement

సోషల్ మీడియాలో అలజడి..
ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ వ్యవహారంతో సోషల్ మీడియా అట్టుడికిపోతోంది. కిరణ్ మాటల్ని ఎవరూ సమర్థించడం లేదు కానీ, అదే సమయంలో గతంలో వైసీపీ నేతలు చేసిన దారుణ వ్యాఖ్యల్ని అప్పట్లో ఎవరూ ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీస్తున్నారు టీడీపీ నేతలు. వారిపై ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. కనీసం అప్పట్లో వైసీపీ నేతలెవరూ ఆ మాటల్ని ఖండించలేదని చెబుతున్నారు.

శ్రీరెడ్డి, బోరుగడ్డకంటే ఎక్కువా..?
గతంలో శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు చాలామంది హైలైట్ చేస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు, లోకేష్ ని శ్రీరెడ్డి బండబూతులు తిట్టేది. ఆ తర్వాత తీరిగ్గా క్షమాపణలు చెప్పింది. శ్రీరెడ్డిపై ఎవరూ కేసు పెట్టలేదు, ఆమె మాటల్ని కనీసం వైసీపీ నుంచి ఎవరూ ఖండించలేదు. ఇక బోరుగడ్డ అనిల్ వ్యాఖ్యలపై వైసీపీలో ఏ ఒక్కరూ స్పందించకపోవడం విశేషం. అలాంటి వాళ్లని ఎంకరేజ్ చేసి మరీ టీడీపీ నేతల్ని టార్గెట్ చేశారని, ఇప్పుడు తప్పు చేసిన టీడీపీ కార్యకర్తని పార్టీనుంచి సస్పెండ్ చేశామని, అదీ తమ పార్టీ చిత్తశుద్ధి అని అంటున్నారు.


జైలుకెళ్లి కలిసొచ్చారుకదా..!
చేబ్రోలు కిరణ్ మాటల్ని ఖండించిన వారు, అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవారు గతంలో పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ మాట్లాడిన మాటల్ని సమర్థిస్తారా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వల్లభనేని వంశీని స్వయంగా జగన్ జైలుకెళ్లి మరీ పరామర్శించారు. పోసాని కోసం ఏకంగా లాయర్ ని పెట్టి వాదనలు నడిపించారు. అలాంటి వారిని వెనకేసుకొచ్చిన జగన్ కి, ఆయన పార్టీకి ఇప్పుడు నొప్పి తెలుస్తుందా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.

“కిరణ్ తప్పు చేశాడు, మేం పార్టీనుంచి సస్పెండ్ చేశాం, పోలీస్ కేసు కూడా పెట్టాం.” కానీ గతంలో అంతకంటే దారుణంగా మాట్లాడిన వారిపై వైసీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×