E-Paper
Advertisement

Tirumala Ghee Case: తిరుమల లడ్డూ ఇష్యూ.. వైసీపీకి దక్కని ఊరట, స్వామి పిటిషన్ సుప్రీం కొట్టివేత

Tirumala Ghee Case:  తిరుమల లడ్డూ ఇష్యూ.. వైసీపీకి దక్కని ఊరట, స్వామి పిటిషన్ సుప్రీం కొట్టివేత
Advertisement

Tirumala Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి కేసులో వైసీపీ ముగినిపోయినట్టేనా? ఆ వ్యవహారంలో కూరుకుపోయిన ఆ పార్టీ నేతల భరతం పట్టేందుకు ఏకసభ్య కమిటీ రంగంలోకి దిగేసిందా? కమిటీని ఆపేందుకు వైసీపీ విసిరిన చివరి అస్త్రం ఫెయిలైందా? సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటిషన్‌ని న్యాయస్థానం కొట్టివేసిందా? ఇకపై ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేయనుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

తిరుమల లడ్డూ ఇష్యూ.. రంగంలోకి ఏకసభ్య కమిటీ

Advertisement

తిరుమల లడ్డూలో రసాయనాల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో సీబీఐ సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏక సభ్య కమిటీని నియమించింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ వ్యవహారం కాస్త వైసీపీలో టెన్షన్ మొదలైంది. తమ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు చంద్రబాబు సర్కార్ పావులు కదుపుతున్నట్లు భావించింది.

ఏపీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు సుబ్రమణ్యస్వామి. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మసనం ముందుకు ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. తొలుత స్వామి తన వాదనలు వినిపించారు. రాజ్యాంగ పదవుల్లోని వారు దీనిపై మాట్లాడకుండా నిలువరించాలని వాదించారు.

Advertisement

సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఓవర్ లాపింగ్ కిందకు రాదని తేల్చి చెప్పింది.  పరిపాలనాపరమైన లోపాల గుర్తింపునకు ఏర్పాటు చేసిందని సీజేఐ ధర్మాసనం తేల్చి చెప్పింది. న్యాయస్థానం ఇచ్చిన మార్గ దర్శకాల ప్రకారం.. సీబీఐ సిట్ విచారణ చేసిందని తెలిపింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాజకీయ నేతలు జోక్యానికి ఎలాంటి ఆస్కారం లేదని తేల్చి చెప్పింది.

అదే సమయంలో రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలు కోర్టుకు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది తప్పా, జోక్యం చేసుకునే పరిస్థితి ఎక్కడా ఉండదని పేర్కొంది. న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు జరుగుతోందని, అందుకు తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని క్లారిటీ ఇచ్చింది.

ALSO READ: వైసీపీ వ్యవహారం.. వంగవీటి ఆశాలత క్లారిటీ, టార్గెట్ ఫిక్సయినట్టే?

నివేదిక తర్వాత బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఏపీ ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిటీని కొనసాగించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాదనల సమయంలో స్వామి లేవనెత్తిన అన్ని అంశాలను సుప్రీంకోర్టు విముఖత చూపినట్టు చెప్పింది. పిటిషన్ ఏ మాత్రం విచారణ అర్హత లేదని చెబుతూ విచారణను ముగించింది. దీంతో ఏకసభ్య కమిటీ ఇప్పుడు ఏం చేస్తుందన్న చర్చ ఏపీలో మొదలైందా?  దీనిపై లోతుగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×