E-Paper
Advertisement

Student : కడప జిల్లాలో స్టూడెంట్ మృతి.. అనుమానాలెన్నో..?

Student : కడప జిల్లాలో స్టూడెంట్  మృతి.. అనుమానాలెన్నో..?
Advertisement

Student : కడప జిల్లా ఖాజీపేట మండలం కొత్తనెల్లూరులో బీరం శ్రీధర్‌రెడ్డి విద్యాసంస్థల్లో విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పులివెందులకు చెందిన ఆరో తరగతి విద్యార్థి సోహైల్‌ శనివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు.

ఆ విద్యార్థి కడుపునొప్పిగా ఉందని హాస్టల్‌ సిబ్బందికి చెప్పాడని తెలుస్తోంది. కుమారుడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడని సమాచారం అందగానే.. వెంటనే హాస్టల్‌ కు చేరుకున్నారు తల్లిదండ్రులు. అప్పటికే సోహైల్‌ మృతిచెందాడు. కానీ తమ కుమారుడు బతికే ఉన్నాడని.. బైక్‌ పై హాస్పిటల్‌ కు తరలించారు. వైద్యులు సోహైల్‌ మృతిచెందినట్టుగా ప్రకటించారు. దీంతో వారు స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తమ కుమారుడి‌ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒంటిపై గాయాలున్నాయని అంటున్నారు. ఉపాధ్యాయుడు కొట్టడం వల్లే చనిపోయాడని ఆరోపిస్తున్నారు. అతని తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్ద సోహైల్‌ మృతదేహంతో ఆందోళనకు చేపట్టారు. విద్యార్థి సంఘాల నాయకుల, స్థానికులు భారీగా పాఠశాల వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. స్కూల్ ఫర్నిచర్‌ ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి.

బీరం శ్రీధర్ రెడ్డి స్కూల్ వద్దకు పోలీసులు చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాలు, బంధువుల ఆందోళన కొనసాగించాయి.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×