E-Paper
Advertisement

Weather Update: వింత వాతావరణం.. రోహిణి కార్తెలో పగలని రోళ్లు, భారీ వర్షాలు

Weather Update: వింత వాతావరణం.. రోహిణి కార్తెలో పగలని రోళ్లు, భారీ వర్షాలు
Advertisement

Weather Update: రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎండలు దంచికొట్టాల్సిన సమయంలో అకాల వర్షాలు పడుతున్నాయి. నేటి నుంచే రోహిణి కార్తె ప్రారంభమైంది. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కొడుతాయని అనే నానుడి ఉంది. కానీ ఈ ఏడాది మాత్రం వాతావరణంలో భిన్నమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎండలు దంచికొట్టే రోహిణి కార్తెలో వర్షాలు పడుతున్నాయి.

రోహిణి కార్తె సమయంలో సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఈ సమయంలో వేడి తీవ్రత చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎండలు బీభత్సంగా కొడుతాయి. ఈ ఏడాది అకాల వర్షాలు, అల్పపీడనం కారణంగా వేసవి కాలం కాస్త వర్షాకాలంగా మారింది. ఈ సారి కొంచెం ముందగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముందస్తుగానే అకాల వర్షాలు పడుతుండడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ తర్వాత వర్షాలు పడతాయో అనే సందిగ్దంలో రైతులు పడిపోయారు.  అయితే ఈ సారి వర్షాలు భారీగా పడే అవకాశం ఉందని ముందుస్తుగానే వాతావరణ శాఖ పేర్కొంది.

Advertisement

అయితే, ఇటీవల కాలంలో వాతావరణ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వేసవి కాలంలో వర్షాలు, వర్షా కాలంలో ఎండలు దంచికొడుతున్నాయని.. వాతావరణంలో భిన్న మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు. ఇందుకు గ్లోబల్ వార్మింగ్, వాతావరణ కాలుష్యం కారణమని వాతావరణ విశ్లేషకులు వివరిస్తున్నారు. ఎల్లుండి పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ALSO READ: Rain Alert: రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

Advertisement

దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి నుంచే ఉద్యానవన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్టర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.

ALSO READ: ARMY PUBLIC SCHOOL: డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు.. నెలకు రూ.52,500 జీతం.. ఇంకెందుకు ఆలస్యం

భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని చెబుతున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మూడు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×