E-Paper
Advertisement

AP Students : మణిపూర్ నుంచి ఏపీ విద్యార్థుల తరలింపునకు చర్యలు.. ప్రత్యేక విమానాలు ఏర్పాటు..

AP Students : మణిపూర్ నుంచి ఏపీ విద్యార్థుల తరలింపునకు చర్యలు.. ప్రత్యేక విమానాలు ఏర్పాటు..
Advertisement

AP Students : మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు, పౌరుల తరలింపు కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీ విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రెండు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సొంత ఖర్చులతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విమానాలను ఏర్పాటు చేసింది. ఒక విమానం హైదరాబాద్‌కు, మరో విమానం కోల్‌కతాకు చేరుకోనుంది. అక్కడి నుంచి వారిని స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకు­న్నారు.

మణిపూర్ నుంచి మొదటి విమానం హైదరాబాద్‌ కు చేరుకుంటుంది. అందులో 108 మంది విద్యార్థులను తీసుకురానున్నారు. రెండో విమానం కోల్‌కతా కు చేరుకుంటుంది. అందులో 49 మంది విద్యార్థులను తీసుకురానున్నారు. మణిపూర్‌లో చిక్కుకున్న మొత్తం 157 మంది విద్యార్థులను ఈ విమానాల్లో రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Advertisement

ఇక తెలంగాణ నుంచి మణిపూర్‌ వెళ్లి అక్కడ చదువుకుంటున్న విద్యార్ధులు, వివిధ పనుల కోసం వెళ్లిన వారు సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఇక్కడి నుంచి వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు రాష్ట్ర పభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అధికారులు వెల్లడించారు.

మణిపూర్‌లో చిక్కుకున్న ఒక తెలంగాణ విద్యార్థిని అధికారులు క్షేమంగా ఢిల్లీకి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీలోని అధికారుల చొరవతో ఆదివారం ఢిల్లీలోని విమానాశ్రయానికి చేరుకున్న విద్యార్థి.. రాత్రి 11 గంటలకు తెలంగాణ భవన్‌కు చేరుకున్నాడు. ఖమ్మం జిల్లా రాంనగర్‌ తండాకు చెందిన హర్షవర్ధన్‌ మణిపూర్‌ నిట్‌లో బీటెక్‌ చదువుతుండగా… ప్రభుత్వం సొంత ఖర్చులతో ఢిల్లీకి తీసుకొచ్చింది. తెలంగాణ భవన్‌లో విద్యార్థికి అధికారులు వసతి ఏర్పాట్లు చేశారు. సోమవారం స్వగ్రామానికి తరలిస్తామని అధికారులు తెలిపారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×