E-Paper
Advertisement

Dead Body Parcel Case: మూడు పెళ్లిళ్లు.. ఒక హత్య.. డెడ్‌బాడీ పార్శిల్ కేసులో అసలు నిజం ఇదే..

Dead Body Parcel Case: మూడు పెళ్లిళ్లు.. ఒక హత్య.. డెడ్‌బాడీ పార్శిల్ కేసులో అసలు నిజం ఇదే..
Advertisement

Dead Body Parcel Case: పార్సిల్‌గా వచ్చిన డెడ్‌ బాడీ ఇప్పుడు ఖాకీలను ఇంకా కలవరపెడుతున్న ప్రశ్న. అసలు ఆ డెడ్‌బాడీ ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారు? ఎందుకు పంపారు? దీనికి సంబంధించి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన డెడ్ బాడీ పార్సిల్ కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీధర్ అలియాస్ సుధీర్ ను పోలీసులు పట్టుకున్నారు. సుధీర్ తో పాటు అతనికి సహకరించిన ఓ మహిళను కూడా అదుపులోకి తీసున్నారు. దీంతో కేసులో అసలు దర్యాప్తు ఇప్పుడు మొదలు కానుంది. అయితే ఆ డెడ్ బాడీ వ్యక్తిని సుధీర్ ఎందుకు చంపాడు? మృతదేహాన్ని తన వదిన ఇంటికి ఎందుకు పార్సిల్ చేశాడనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. పోలీసులు అదుపులో నిందితుడు ఉన్నాడు కాబట్టి ఇవాళో రేపో దర్యాప్తు పూర్తి అయ్యే అవకాశం ఉంది.

Advertisement

అయితే చనిపోయిన వ్యక్తి కూలీగా పనిచేసే పర్లయ్యగా తెలుస్తోంది. పర్లయ్యకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. వారి మధ్య విభేధాల కారణంగా కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. గతంలో లారీ డ్రైవర్ గా పనిచేసిన పర్లయ్య.. ఆ తర్వాత బతుకుదెరువుకోసం కూలీ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పని కోసం పర్లయ్యను శ్రీధర్ తీసుకువెళ్లి హతమార్చాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పర్లయ్యనే ఎందుకు చంపాల్సి వచ్చిందేనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.

ఇక.. ఆ డెడ్ బాడీని తులసీ ఇంటికే ఎందుకు పార్శిల్ చేశాడనే విషయంలో పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. తులసితో శ్రీధర్‌వర్మకి ఆస్తి గొడవలు ఉన్నాయని గుర్తించారు పోలీసులు. అందులో భాగంగానే డెడ్ బాడీ పార్సిల్ చేసి డబ్బు ఇవ్వాలని ఓ లేఖ రాసినట్టు అనుమానిస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు కాబట్టి ఈ విషయంపై కూడా క్లారిటి రానుంది.

Advertisement

Also Read:  డెడ్‌బాడీ హోం డెలివరీ కేసులో.. సంచలన విషయాలు

నిందితుడు అరెస్ట్ కావడానికి ముందే మరికొన్ని సంచలనాలను పోలీసులు గుర్తించారు. నిందితుడు సుధీర్‌‌వర్మ మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్టు తేల్చారు. ప్రస్తుతం మూడో భార్యతో కాళ్ల గ్రామంలో ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో… బాక్సులో మృతదేహాన్ని పంపిన మహిళ శ్రీధర్ మూడో భార్య అయి ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి.. మొత్తానికి సినిమా రేంజ్ ట్విస్టులతో నడుస్తున్న ఈ డెడ్ బాడీ పార్శిల్ కేసు ఆఖరు ఘట్టానికి చేరుకుంది. అయితే నిందితుడి పూర్తిగా విచారిస్తే అన్ని విషయాలపై క్లారిటీ రానున్నాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×