E-Paper
Advertisement

Avinash Reddy : ముందస్తు బెయిల్ కు అవినాష్ రెడ్డి ప్రయత్నాలు.. సుప్రీంకోర్టులో షాక్..

Avinash Reddy : ముందస్తు బెయిల్ కు అవినాష్ రెడ్డి ప్రయత్నాలు.. సుప్రీంకోర్టులో షాక్..
Advertisement

Avinash Reddy : కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. వివేకా హత్య కేసు విచారణలో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు అవినాష్‌రెడ్డి. అయితే ఆయన వేసిన పిటిషన్ విచారణ తేదీని సీజేఐ ధర్మాసనం ఖరారు చేయలేదు. తక్షణ విచారణకు అనుమతి ఇవ్వలేదు. విచారణ అత్యవసరమైతే రాతపూర్వకంగా అభ్యర్థన ఇవ్వాలని సీజేఐ సూచించింది. దీంతో అవినాష్ రెడ్డి పిటిషన్ విచారణ వేసవి సెలవుల్లోనే ఉండనుంది. మెన్షనింగ్ లిస్ట్‎ను వినకుండానే బ్యాచ్‌ల వారీగా తేదీలు కేటాయిస్తామన్నారు సీజేఐ.

వివేకా హత్య కేసు దర్యాప్తులో మంగళవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విచారణకు హాజరుకావాలని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే హైదరాబాద్‌లోనే ఉన్నా విచారణకు రాలేనని చివరి నిమిషంలో సీబీఐకి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. ముందస్తు కార్యక్రమాలను కారణంగా చూపారు. విచారణకు 4 రోజుల సమయం కావాలని కోరారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి కడపకు వెళ్లారు.

Advertisement

అవినాష్ రెడ్డి వెళ్లగానే.. సీబీఐ బృందం కూడా కడపకు వెళ్లింది. అవినాష్‌రెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన డ్రైవర్ కు నోటీసులు అందించింది. ఈ నెల 19న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. వివేకా హత్య కేసు దర్యాప్తు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో సీబీఐ దర్యాప్తుపై ఉత్కంఠ పెరుగుతోంది. అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదనే ప్రచారం సాగుతోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×