E-Paper
Advertisement

AP Nominations: ముగిసిన నామినేషన్ల పరిశీలన.. అత్యధిక నామినేషన్లు ఎక్కడంటే ?

AP Nominations: ముగిసిన నామినేషన్ల పరిశీలన.. అత్యధిక నామినేషన్లు ఎక్కడంటే ?
Advertisement

AP Nominations: ఏపీలో సార్వత్రిక ఎన్నికల కోసం దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తి కావాల్సి ఉండగా కాస్త ఆలస్యమైంది. నామినేషన్లు పెద్ద సంఖ్యలో దాఖలు కావటంతో వాటిని స్క్రూటిని చేసేందుకు అధికారులకు రెండు రోజుల సమయం పట్టింది.

రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలకు 686 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది. వాటిలో 503 నామినేషన్లకు ఆమోదం లభించింది. 183 నామినేషన్లను వివిధ కారణాలతో రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. అత్యధికంగా గుంటూరు పార్లమెంట్‌ స్థానానికి 47 నామినేషన్లు రాగా..శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానానికి అత్యల్పంగా 16 నామినేషన్లు దాఖలయ్యాయి.

Advertisement

Also Read:  వైసీపీ పవిత్ర గ్రంథం, రెండు పేజీలు అవసరమా అంటూ..

మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 3,644 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 2,705 నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు ఆమోదించారు. 939 నామినేషన్లు తిరస్కరించారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి అత్యధికంగా 52 నామినేషన్లు దాఖలు కాగా..అత్యల్పంగా చోడవరం నియోజవర్గంలో 8 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇదిలా ఉంటే నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం ఏప్రిల్‌ 29 వరకూ గడువు విధించింది. నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత తుది అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×