E-Paper
Advertisement

Sad Incident: ఘోరం.. ప్రమాద స్థలాన్ని చూపించబోయి తనే యాక్సిడెంట్‌లో దుర్మరణం

Sad Incident: ఘోరం.. ప్రమాద స్థలాన్ని చూపించబోయి తనే యాక్సిడెంట్‌లో దుర్మరణం
Advertisement

Sad Incident in Thottambedu: తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రమాదం జరగగా. .ఆ ప్రమాద స్థలాన్ని చూపించేందుకు వెళ్లిన ఓ అటవీశాఖ ఒప్పంద ఉద్యోగి ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లాలోని తొట్టంబేడు మండలం పెద్దకన్నలి గ్రామ సమీపంలో నాయుడుపేట-మదనపల్లి జాతీయ రోడ్డుపై చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. తొట్టంబేడు మండలం బసవయ్యపాలెం ఎస్‌టీ కాలనీకి చెందిన వెంకటేష్‌ (35 15 ఏళ్లుగా బసవయ్యపాలెం చెక్‌పోస్టు వద్ద ఒప్పంద ఫారెస్ట్‌ వాచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే పెద్దకన్నలి దగ్గరలో ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్, కేరళ బస్సు బలంగా ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి బయలుదేరారు.

Advertisement

అయితే అక్కడే విధుల్లో ఉన్న వెంకటేష్ ను వెంట తీసుకెళ్లారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్తుండగా.. పోలీస్ వాహనాన్ని మరో లారీ వేగంగా వచ్చి ఢీకొట్లింది. ఈ ప్రమాదంలో వెంకటేష్ స్పాట్ లోనే దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×