E-Paper
Advertisement

Road roller: విషాదం.. ఒకరి నిర్లక్ష్యం.. ఇద్దరు యువకులు బలి!

Road roller: విషాదం.. ఒకరి నిర్లక్ష్యం.. ఇద్దరు యువకులు బలి!
Advertisement

Road roller accident Two young people are victims: చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం మరో గ్రామానికి వెళ్లిన ఇద్దరు యువకులను రోడ్ రోలర్ డ్రైవర్ నిర్లక్ష్యం బలి తీసుకుంది. పని ముంగించుకొని నిద్రిస్తున్న ఆ ఇద్దరు యువకులపై రోడ్ రోలర్ ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలోని తీర్థం గ్రామ సమీపంలో ఓ కంపెనీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. ఈ కంపెనీలో పనిచేసేందుకు అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు తమ కుటుంబాలకు ఆసరాగా ఉంటుందని వెళ్లారు. అక్కడ రహదారి నిర్మాణ పనులు చేస్తున్న కంపెనీలోనే రాత్రి వాచ్‌మెన్‌గా చేరారు. అయితే ఇంతలోనే విషాదం ఆ ఇద్దరిని వెంటాడింది.

Advertisement

బెంగళూరు నుంచి చెన్నై రహదారి రోడ్డులో రాత్రి వాచ్ మెన్ గా అషరఫ్, సాదిక్ ఇద్దరు పనిలో చేరారు. పని పూర్తయిన తర్వాత ఇద్దరు కొంత సేపు నిద్ర పోదామని అనుకున్నారు. ఇంతలో డ్రైవర్ నిర్లక్ష్యంగా రోడు రోలర్ నడపడంతో వారిద్దరిపై వెళ్లిందిత. దీంతో ఇద్దరూ మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పారిపోయాడు.

Also Read: పవన్ పై వ్యతిరేకత.. తమిళనాడులో రోజా బిజి బిజీ, ప్లాన్ ‘అదిరింది’

Advertisement

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విగతజీవులుగా పడిన వారిని చూసి రోదించారు. నెలకు రూ.11వేలకు ఇద్దరూ వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి రోదనలు అందరినీ కంటతడిపెట్టించాయి.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×