E-Paper
Advertisement

Tdp ex mla to Ysrcp: రాయచోటిలో టీడీపీ షాక్, వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే, జంపయితే సీటిస్తారా?

Tdp ex mla to Ysrcp: రాయచోటిలో టీడీపీ షాక్, వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే, జంపయితే సీటిస్తారా?
Advertisement
Rayachoti tdp ex mla reddappagari ramesh reddy will join ysrcp discuss mithunreddy

Tdp ex mla to Ysrcp: ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలో టీడీపీకి షాక్ తగలబోతోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి టికెట్ దక్కలేదన్న కారణంగా మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేష్‌రెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆయన అసంతృప్తిని గమనించిన వైసీపీ ఎంపీ మిధున్‌రెడ్డి చర్చలు జరిపారు. దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. రేపోమాపో ఆయన ఫ్యాన్స్ పార్టీ కండువా కప్పుకోవడం ఖాయమంటున్నారు. ఇంతకీ టీడీపీ టికెట్ నిరాకరించడానికి కారణమేంటి? ఇంకా లోతుల్లోకి వెళ్తే..

రాయచోటి నియోజకవర్గం వైపీసీకి కంచుకోట. అక్కడి నుంచి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఉపఎన్నికతోపాటు నాలుగుసార్లు గెలుపొందారు. రెండుసార్లు ఆయన చేతిలో ఓడిపోయారు మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేష్‌రెడ్డి. పరిస్థితి గమనించిన టీడీపీ అధిష్టానం పలుమార్లు సర్వే చేయించింది. అయినా రమేష్‌రెడ్డి ఏమాత్రం అనుకూలంగా లేదని తేలింది. దీంతో అభ్యర్థిపై పలుదఫాలుగా జిల్లా నాయకులతో మంతనాలు సాగించింది. చివరకు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి టికెట్ కేటాయించడంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Advertisement

కొద్దిరోజులుగా రమేష్‌రెడ్డి టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికి అక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పరిస్థితి గమనించిన ఆయన, రమేష్‌రెడ్డితో మాట్లాడారు. చివరకు శనివారం రాత్రి ఎంపీ మిధున్‌రెడ్డితో ఆయన సమావేశమయ్యారు. పార్టీలో సముచిత స్థానం ఇస్తామని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కానీ.. సీటుపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈనెల తొమ్మిదిన జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు.

ALSO READ: బుక్కైన సీఎం రమేష్, 9న విచారణకు రావాలంటూ

Advertisement

అసెంబ్లీ అభ్యర్థులను ఒకేసారి వైసీపీ ప్రకటించింది. అంతేకాదు సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ని కాదని మరో వ్యక్తికి ఫ్యాన్స్ పార్టీ సీటు ఇచ్చే అవకాశం లేదు. ఈ మాత్రం దానికి రమేష్‌రెడ్డి కంగారుపడి.. వైసీపీలోకి ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడంలేదని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. కడప జిల్లా అధ్యక్షుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డికి సోదరుడు రమేష్‌రెడ్డి. సొంత అన్న చెప్పినా రమేష్ వినలేదని సమాచారం. రమేష్‌రెడ్డి రాక తనకు కలిసొస్తుందని ఎంపీ అభ్యర్థి మిధున్‌రెడ్డి భావిస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×