E-Paper
Advertisement

Tirupati To Shirdi: తిరుపతి నుంచి షిర్డీకి ప్రతీ రోజూ ట్రైన్.. సీఎం చంద్రబాబు సూచన, రైల్వేశాఖ ఆమోదం

Tirupati To Shirdi: తిరుపతి నుంచి షిర్డీకి ప్రతీ రోజూ ట్రైన్.. సీఎం చంద్రబాబు సూచన, రైల్వేశాఖ ఆమోదం
Advertisement

Tirupati To Shirdi: ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. ఏపీ నుంచి వివిధ రాష్ట్రాలకు రైళ్లు, విమానాలు కనెక్ట్‌విటీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి -షిర్డీకి ట్రైన్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఒకప్పుడు వారంలో ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఉండేది. సీఎం చంద్రబాబు రైల్వేమంత్రికి లేఖ రాశారు. దీంతో ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇకపై ఈ రెండు టెంపుల్ సిటీల మధ్య ప్రతీరోజూ రైలు భక్తులకు అందుబాటులోకి రానుంది.

ఏపీ ప్రజలకు కేంద్రప్రభుత్వం ఓ శుభవార్త చెప్పేసింది. ఇకపై ప్రతిరోజూ తిరుపతి-షిర్డీ మధ్య ట్రైన్ అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు ఈ రెండు టెంపుల్ సిటీల మధ్య వారానికి ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఉండేది. ఇకపై రెగ్యులర్ సర్వీసు కానుంది. ఈ మేరకు రైల్వేశాఖ ప్రకటన చేసింది.

Advertisement

రానున్న పండుగల నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తిరుపతి నుంచి షిర్డీ మధ్య 07637/07638 నెంబర్‌తో రోజూ ట్రైన్ నడపనున్నట్లు పేర్కొంది. కొద్దిరోజుల కిందట సీఎం చంద్రబాబు రైల్వేమంత్రికి ఓ లేఖ రాశారు. ఆయన ప్రతిపాదనను కేంద్రం ఆమోదం తెలిపింది.

విచిత్రం ఏంటంటే ఈ రైలు ఏపీ-తెలంగాణ ప్రాంతాల మీదుగా నడిపితే ఆ రైలు నిత్యం బిజీగా ఉండేదని అంటున్నారు భక్తులు. రేణిగుంట, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ స్టేషన్ల మీదుగా షిర్డీకి చేరుకోనుంది. తిరుమల బ్రహ్మోత్సవాలు, దసరా, దీపావళి పండుగలు రాబోతున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకున్న కేంద్రం, ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

ALSO READ: టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్, వైసీపీకి చెమటలు

తిరుమలకు వెళ్లేవారికి రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇటీవల కొన్ని రైళ్లను నవంబర్ వరకు పొడిగించిన విషయం తెల్సిందే. తిరుపతి-షిర్డీ, నరసాపురం-అరుణాచలం మధ్య నడిచే రైళ్లతోపాటు హైదరాబాద్-కొల్లాం, కాచిగూడ-మధురై మార్గాల్లో ప్రత్యేక రైళ్లు తిరుపతి మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఈ సదుపాయాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుంటారని అధికారులు భావిస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×