E-Paper
Advertisement

Arava Sridhar: ఢిల్లీకి చేరిన జనసేన ఎమ్మెల్యే వివాదం.. జాతీయ మహిళా కమిషన్, లోక్‌పాల్‌కు చేరిన బాధితురాలి ఆవేదన!

Arava Sridhar: ఢిల్లీకి చేరిన జనసేన ఎమ్మెల్యే వివాదం.. జాతీయ మహిళా కమిషన్, లోక్‌పాల్‌కు చేరిన బాధితురాలి ఆవేదన!
Advertisement

వైఎస్సాఆర్ జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ.. రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారం కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా.. దేశ రాజధాని ఢిల్లీ స్థాయికి చేరుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తోంది.

ఒక మహిళా ఉద్యోగి పట్ల ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరుపై మాలల రాజ్యాధికార సాధన సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ సమితి అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు బాధితురాలికి అండగా నిలుస్తూ నేరుగా భారత రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, మహిళా ఉద్యోగి పట్ల అనుచితంగా ప్రవర్తించడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందని ఆయన మండిపడ్డారు.

Advertisement

ఈ వ్యవహారంపై కేవలం రాష్ట్రపతి, ప్రధానికే కాకుండా.. జాతీయ మహిళా కమిషన్, జాతీయ లోకాయుక్త, జాతీయ లోక్ పాల్, జాతీయ ఎస్సీ కమిషన్లకు కూడా అధికారికంగా ఫిర్యాదులు అందాయి. ఎమ్మెల్యే అధికార బలంతో బాధితురాలిని వేధిస్తున్నారని, ఆమెకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఒక ‘ప్రత్యేక కమిషన్’ (Special Commission) ఏర్పాటు చేయాలని మాలల రాజ్యాధికార సాధన సమితి డిమాండ్ చేస్తోంది.

డాక్టర్ దాసరి చెన్నకేశవులు మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి మహిళల గౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరమని అన్నారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు, ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఆధారాలను సేకరించామని, జాతీయ స్థాయి సంస్థలు స్పందించి బాధితురాలికి రక్షణ కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మౌనం వీడి, సదరు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ట్విస్ట్‌తో రైల్వేకోడూరు నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

Advertisement

ALSO READ: CM Revanth Reddy: కేటీఆర్ మాటలు డ్రగ్స్ తీసుకున్నట్లే ఉన్నాయి.. వారిది గంజాయి బ్యాచ్.. రేవంత్ ఘాటు కౌంటర్!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×