E-Paper
Advertisement

Purandeswari: జనసేనతో బీజేపీ పొత్తుపై.. క్లారిటీ ఇచ్చిన పురందేశ్వరి

Purandeswari: జనసేనతో బీజేపీ పొత్తుపై.. క్లారిటీ ఇచ్చిన పురందేశ్వరి
Advertisement

Purandeswari: జనసేనతో బీజేపీ పొత్తుపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక కామెంట్స్ చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పర్యటించిన ఆమె.. దండమూడి జిల్లా కార్యకర్త సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జనసేనతో బీజేపీ పొత్తు ఉందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు జనసేన ఎక్కడా చెప్పలేదన్నారు. ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం నిధులిచ్చిందని, పార్లమెంట్ సాక్షిగా అమరావతే ఏపీ రాజధాని అని కేంద్రం ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.

రాష్ట్రంలో కేంద్రం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. పోలవరం నిర్మాణానికి కూడా ప్రతి రూపాయి కేంద్రమే భరిస్తోందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండేలా పార్టీని సన్నద్ధం చేస్తున్నామని పురందేశ్వరి తెలిపారు. దొంగ ఓట్లపై తాముకూడా పోరాడుతున్నామని, నకిలీ ఐడీలతో ఓట్లు నమోదు చేస్తున్న విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

Advertisement

పీఎం ఆవాస యోజన కింద ఏలూరు జిల్లాకు లక్ష ఇళ్లను కేటాయించామన్న పురందేశ్వరి.. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇళ్లు నిర్మించిందో శ్వేతపత్రం ఇవ్వాలన్నారు. ఆడుదాం ఆంధ్రా కాదు.. వైసీపీ నేతలే ఆంధ్రాతో ఆడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపైసా తమ జేబుల్లోకి వెళ్లాలనేది వైసీపీ ఆలోచన అని దుయ్యబట్టారు. తుపాను కారణంగా పొగాకు పంటలు బాగా దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతుల ఆర్తనాదాలు ఈ ప్రభుత్వానికి వినిపించట్లేదని విమర్శించారు. రాష్ట్రానికి ఏ రకంగానూ న్యాయం చేయని వైసీపీ ఏపీకి అవసరమా ? అని ప్రశ్నించారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×