E-Paper
Advertisement

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు
Advertisement

Pulivendula ByPoll: పులివెందుల బైపోల్‌ను వైసీపీ అధినేత జగన్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా? కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నారా? వైసీపీ జెడ్పీ‌టీసీ అభ్యర్థిని బంధించిందెవరు? ఓ వైపు పోలింగ్.. మరోవైపు నేతలు మాటలు కోటలు దాటుతున్నాయి.

కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ సీట్లకు మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 వరకు జరగనుంది. ఉదయం నుంచే ఓటర్లు తమతమ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడికానున్నాయి. పోలింగ్ మొదటి నుంచి ప్రలోభాల పర్వం ఊపందుకుంది.

Advertisement

ఈ ఉప ఎన్నిక కోసం జగన్ వంద కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి. ఇంకా డబ్బులు పంచుతూనే ఉన్నారంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. మహిళలకు ముక్కు పుడకలు, చీరలు పంపిణీ చేస్తున్నారని, పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. అవినీతి సొమ్మును పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక కోసం కుమ్మరిస్తున్నారని మండిపడ్డారు.

మరోవైపు పులివెందులలో పోలింగ్ ను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌రెడ్డి విమర్శించారు. తన ఇంటి చుట్టూ టీడీపీ గూండాల‌ను పెట్టిందని, క‌ర్ర‌లు-రాడ్లు ప‌ట్టుకుని తిరుగుతున్నారని అన్నారు.

Advertisement

ALSO READ: ఏపీ లిక్కర్ కేసులో కొత్త విషయాలు, బిగ్‌బాస్ చుట్టూ ఉచ్చు

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి రక్షణ కల్పించలేని దుస్థితిలో పోలీసులు ఉన్నారని మండిపడ్డారు. పోలింగ్ బూత్ లోపలికి ఏజెంట్లను ఎవరినీ వెళ్లనీయలేదన్నారు. ఈ మేరకు ఆయన ఓ విడియో విడుదల చేశారు. ప్రధాన పార్టీలకు సంబంధించిన కీలక నేతలు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు.

జరుగుతున్న పరిణామాలను చూస్తున్న ప్రజలు, అసెంబ్లీకి ఎన్నిక జరుగుతున్నట్లు ఉందని అంటున్నారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత  ఓటర్లు ఈ తరహా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు.  300  పైగా బైండోవర్ కేసులు నమోదు చేశారు. లాడ్జి, హోటళ్లు తనిఖీలు చేశారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చినవారిని వారి ప్రాంతాలకు తరలించారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×