E-Paper
Advertisement

Prudhvi comments on Ambati, Mudragada: వైసీపీకి టైమ్ ఐపోయింది.. అంబటి, ముద్రగడకు ఈసారి

Prudhvi comments on Ambati, Mudragada: వైసీపీకి టైమ్ ఐపోయింది.. అంబటి, ముద్రగడకు ఈసారి
Advertisement

Prudhvi comments on Ambati, Mudragada(Andhra politics news): జగన్ సర్కార్‌పై సినీ నటులు దూకుడు పెంచారు. ఈ జాబితాలో ముందు ఉంటారు కమెడియన్ పృథ్వీరాజ్. వైసీపీ సర్కార్‌కు టైమ్ అయిపోయిందని, కేవలం వారం రోజులు మాత్రమే ఉందన్నారు. సోమవారం తిరుపతిలో మాట్లాడిన ఆయన, సినిమా స్టయిల్‌లో పంచ్ డైలాగ్స్ విసిరారు. జనం జేబుల్లో డబ్బులు వేస్తే అదే వైసీపీ అభివృద్ధి, అదే నినాదమన్నారు. మే 13న బాక్సులు బద్దలవుతాయన్నారు. వైసీపీని ఓడించేందుకు అందరకు కంకణం కట్టుకున్నారని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న డ్రామాలు ఏ సినిమాల్లోనూ ఉండవని, ఆ రేంజ్‌లో ప్రస్తుతం జరుగు తున్నాయని ఆరోపించారు పృథ్వీరాజ్. పనిలోపనిగా మంత్రి అంబటి రాంబాబుపై సెటైర్లు వేశారు. శ్యాంబాబు గురించి మంత్రి అంబటికి ఎందుకుని, అరగంట డ్యాన్స్ చేస్తే ఆయన్ని తాను ఇమిటేట్ చేయాలా? అంటూ ప్రశ్నించారు. సంక్రాంతి వేళ భోగి మంటలు వేసినప్పుడు అంబటిని పిలుస్తారని, ఎంతో కొంత రెమ్యూనరేషన్ ఇస్తారని పంచ్ వేశారు.

Advertisement

పవన్ గురించి అంబటి చేసిన కామెంట్స్‌ను గుర్తు చేస్తూ.. మూడు పెళ్లిళ్లు, రెండు చోట్ల ఓడిపోవడాన్ని తనదైనశైలి వ్యాఖ్యలు చేశారాయన. సొంత అల్లుడే మంత్రి అంబటిని తిట్టారన్నారు. ప్రకృతి మారు తున్నప్పుడు దేవుడు ఇవన్నీ సృష్టిస్తాడన్నారు. మరో వైసీపీ నేత ముద్రగడ పైనా కామెంట్స్ చేశారు. ముద్రగడకు తాము ఎప్పుడో పేరు మార్చామని పద్మనాభరెడ్డిగా నామకరణం చేశామన్నారు.

ALSO READ: జగన్‌కు దెబ్బ మీద దెబ్బ, వాస్తు దెబ్బ కొట్టిందా, వరుస షాక్‌లు?

Advertisement

అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై వైసీపీ నేతలు చేసిన కామెంట్స్‌ని తిప్పికొట్టారు నటుడు పృథ్వీ. వైసీపీ నేతలు మాట్లాడితే ఆయన నాన్ లోకల్ అని అంటున్నారని, 2014 ఎన్నికల్లో విజయమ్మ విశాఖపట్నం నుంచి పోటీ చేసినప్పుడు ఆమె నాన్ లోకల్ కాదా అంటూ వైసీపీని సూటిగా ప్రశ్నించారు ఒకప్పుడు వైసీపీలో ఉండేవారు నటుడు పృథ్వీరాజ్‌. కాకపోతే అనివార్య కారణాల వల్ల ఫ్యాన్ పార్టీకి ఆయన గుడ్ బై చెప్పేశారు. బ్రో సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్‌లో నటించారు పృథ్వీ. ఆ మూవీ తర్వాత అంబటి వర్సెస్ పృథ్వీరాజ్‌గా మాటల యుద్ధం మొదలైంది.. తారాస్థాయికి చేరింది. అది ఇంకా కంటిన్యూ అవుతోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×