E-Paper
Advertisement

Prakasam Crime : ప్రకాశం జిల్లాలో కీచక పర్వం.. విద్యార్థిని ట్రాప్ చేసిన ఉపాధ్యాయుడు..

Prakasam Crime : ప్రకాశం జిల్లాలో కీచక పర్వం.. విద్యార్థిని ట్రాప్ చేసిన ఉపాధ్యాయుడు..
Advertisement

Prakasam Crime : విద్యాబుద్దులు నేర్పాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఏకంగా తన ఇంటికి తీసుకొని వెళ్ళి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణం ప్రకాశం జిల్లా దోర్నాలలో చోటు చేసుకుంది . వివరాల్లోకి వెళితే దోర్నాల జిల్లా పరిషత్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడుగా పని చేస్తున శ్రీనివాస్ ప్రసాద్ ఒక బాలికకు మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆయన చేస్టలకు విసిగిపోయింది. అక్కడి నుంచి తిరిగి తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.

విద్యార్థిని అన్న బాజీ కోపంతో ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్ళి నిలదీశాడు. శ్రీనివాస ప్రసాద్ నన్నే నిలదీస్తావా అంటూ.. కత్తితో బాజీపై దాడికి పాల్పడ్డాడు. దీంతో బాజీకి గాయాలయ్యాయి. వెంటనే బాజీని దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటన పై పోలీసులు, విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. విద్యార్థిని తల్లిదండ్రులు న్యాయం చేయాలని.. ఇలాంటి ఉపాధ్యాయులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇలాంటి వారుంటే ఆడపిల్లల్ని చదివించాలనే ఆలోచన కూడా ఎవరికీ ఉండదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×