E-Paper
Advertisement

Montha Politics: ఫేక్ ఫెలోస్ అంటూ మండిపడ్డ సీఎం.. ఏపీలో మొంథా రాజకీయం

Montha Politics: ఫేక్ ఫెలోస్ అంటూ మండిపడ్డ సీఎం.. ఏపీలో మొంథా రాజకీయం
Advertisement

ఏపీలో తుఫాన్ రాజకీయం మొదలైంది. ఓవైపు సీఎం చంద్రబాబు రెండ్రోజుల నుంచి ఇంటికి వెళ్లకుండా సచివాలయంలోనే మకాం వేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు తుఫాన్ సహాయక చర్యలు నిల్, ప్రభుత్వం ఫెయిల్ అంటోంది వైసీపీ. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఫేక్ ఫెలోస్ అంటూ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. దీనికి కూడా వైసీపీ కౌంటర్ రెడీ చేసుకుంది.

రంగంలోకి టీడీపీ నేతలు..
మొంథా తుఫాన్ విషయంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న విషయం తెలిసిందే. తుఫాన్ కి రెండు రోజుల ముందు నుంచీ ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఎక్కడికక్కడ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఆర్టీజీ సెంటర్ నుంచి సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించారు. అటు స్థానిక నేతలు, కార్యకర్తల్ని నేరుగా రంగంలోకి దింపారు. అధికారులతోపాటు ఈసారి టీడీపీ నేతలు కూడా ప్రజల్లోకి వెళ్లి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించారు.

Advertisement

చంద్రబాబు ఆగ్రహం..
ఏపీ ప్రజల అదృష్టం బాగుండి తుఫాన్ వల్ల పెద్ద నష్టం జరగలేదు. అయితే ఈసారి ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని పూర్తిగా తగ్గించలిగామని చెప్పుకుంటోంది ప్రభుత్వం. కానీ పంట నష్టం మాత్రం తప్పలేదు. తుఫాన్ తీరం దాటిన తర్వాత సీఎం చంద్రబాబు జనంలోకి వచ్చారు. రైతుల్ని పరామర్శించారు, వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పునరావాస కేంద్రాలకు వెళ్లారు.

Advertisement

ఈ క్రమంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన వద్ద ప్రస్తావించగా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. “పీపుల్ ఆర్ హ్యాపీ, దీస్ ఫేక్ ఫెలోస్ ఆర్ నాట్ హ్యాపీ” అని మండిపడ్డారు.

వైసీపీ విమర్శలు..
మొంథా తుఫాన్ విషయంలో వైసీపీ ఆచితూచి విమర్శలు మొదలు పెట్టింది. సీఎం, డిప్యూటీ సీఎం అడ్రస్ లేరని మొదట్లో సాక్షిలో వార్తలొచ్చాయి. ఆ తర్వాత నేతలంతా సమీక్షలకే పరిమితం అయ్యారని, క్షేత్ర స్థాయిలో ఎవరూ లేరని విమర్శలు చేశారు. తీరా ఇప్పుడు అధికారులు బాగా పనిచేశారని, నాయకులు మాత్రం ప్రమోషన్లు, ఎలివేషన్లు అంటూ కెమెరాల ముందుకొచ్చారని అంటున్నారు. తుఫాన్ వల్ల ప్రాణ నష్టం జరక్కుండా చూశామని ప్రభుత్వం చెబుతుంటే, ప్రతిపక్ష వైసీపీ విమర్శలకు కారణాలు పోగు చేసుకుంటోందని టీడీపీ నేతలంటున్నారు.

తుఫాన్ రాజకీయం..
తుఫాన్ తీరం దాటిన తర్వాత ఏపీలో రాజకీయ తుఫాన్ అలజడి రేపుతోంది. తుఫాన్ విషయంలో ఇటూ కూటమి, అటు వైసీపీ నేతలు సోషల్ మీడియాలో విమర్శలతో విరుచుకుపడుతున్నారు. బాధితులు కూడా పార్టీల పరంగా విడిపోయారనే విషయం అర్థమవుతోంది. ప్రభుత్వ సేవలు అద్భుతం అని కొనియాడేవారి వీడియోలు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి.

అదే సమయంలో తమను నాయకులు పట్టించుకోలేదనే వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. మొత్తమ్మీద ఈసారి తుఫాన్ కాస్త ప్రశాంతంగానే తీరం దాటిందని తెలుస్తోంది. ప్రాణ నష్టాన్ని ప్రభుత్వం పూర్తిగా నివారించినట్టు తెలుస్తోంది. పంట నష్టం మినహా, మిగతా ఆస్తి నష్టాన్ని కూడా కనిష్టానికి పరిమితం చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది.

Also Read: కూలిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఇల్లు, అరిష్టం తప్పదా?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×