E-Paper
Advertisement

Amaravati : జగన్‌కు మోదీ ఛాన్స్ ఇస్తారా?

Amaravati : జగన్‌కు మోదీ ఛాన్స్ ఇస్తారా?
Advertisement

Amaravati : అమరావతి 2.0. ఆంధ్రుల కలల రాజధానికి పునర్‌నిర్మాణం. జస్ట్ డేట్ ఛేంజ్. అప్పుడు 2015 అక్టోబర్ 22. ఇప్పుడు 2025 మే 2. పదేళ్లు గిర్రున తిరిగిందంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. ప్రధాని మోదీనే. ముఖ్యమంత్రి చంద్రబాబే. ప్రతిపక్షంలో ఉన్నది జగనే. ఇంకేం మారలేదు. ఆశల పల్లకి అలానే ఉంది. అయితే, ఆనాటికి ఈనాటికి ఎంతో తేడా ఉంది.

అమరావతి వైభవం

Advertisement

జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. మూడు ముక్కలు చేసిన రాజధానిని మళ్లీ ఒక్కటి చేశారు. ఆనాడు బుడిబుడి అడుగుతు. ఇప్పుడు వేగంగా పరుగులు. అప్పుడు కేవలం కాగితాల్లోనే ఉండేది అమరావతి. ఇప్పుడు రాజధానిలో అనేక రోడ్లు, భవనాలు. లేటెస్ట్‌గా ప్రపంచ బ్యాంకు నుంచి 6వేల కోట్లకు పైగా నిధులు సమకూరాయి. చకచకా పనులు జరగనున్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆ శుభకార్యానికి శ్రీకారం చుట్టబోతోంది ఏపీ సర్కార్.

ఈసారైనా…?

Advertisement

2015లో.. ఎన్నో ఆశలతో.. అమరావతి గడ్డపై కాలు మోపారు ప్రధాని మోదీ. విభజన హామీ మేరకు భారీగా నిధులు గుమ్మరిస్తారని అనుకున్నారు అంతా. కానీ, పిడికెడు మట్టి, చెంబెడు నీళ్లు మాత్రం ఇచ్చి వెళ్లారంటూ విమర్శలు మూటగట్టుకున్నారు. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ అవుతాయా ఏంటి.. అని ఆంధ్రులు తమకు తాము సర్ధి చెప్పుకున్నారు. ఇప్పుడదే మోదీ.. అదే ప్రధాని హోదాలో.. మళ్లీ అమరావతి బాట పట్టారు. ఈసారైనా…? అంటూ ఏపీ వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తప్పేం లేదు. ఏపీ విభజన చట్టంలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని రాసుంది. ఏపీ కూటమి ప్రభుత్వంలో బీజేపీ సైతం భాగస్వామిగా ఉంది. మంత్రి పదవులు కూడా అనుభవిస్తోంది. కేంద్రంలో టీడీపీ నెంబర్ 2 పార్టీగా బలంగా ఉంది. మోదీ, చంద్రబాబుల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక, మోదీకి వీరాభిమాని అయిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇంతటి పాజిటివ్ వైబ్‌లో.. ఈసారైనా.. ప్రధాని మోదీ నుంచి అమరావతికి ఏదైనా పెద్దగా ఆశించడంలో తప్పేముంది.. థింక్ బిగ్ అంటున్నారు ఆంధ్రులు.

జగన్‌కు ఛాన్స్ ఇస్తారా?

జగన్‌తో సహా ప్రముఖులు అందరికీ ఆహ్వానాలు పంపింది ఏపీ ప్రభుత్వం. మరి, ఈ కార్యక్రమానికి జగన్ వస్తారా? డుమ్మా కొడతారా? ప్రధాని అమరావతిపై వరాల జల్లు కురిపిస్తే ఇక ప్రతిపక్షానికి పని లేకుండా పోతుంది. అదే, మోదీ మాటలకే పరిమితమైతే.. జగన్‌కు మంచి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అందుకే, అమరావతి పునర్ ప్రారంభోత్సవ కార్యక్రమం రాజకీయంగానూ ఎంతో ఇంపార్టెంట్ అంటున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×