E-Paper
Advertisement

TDP : పోలవరం పాలిటిక్స్.. టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు..

TDP : పోలవరం పాలిటిక్స్.. టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు..
Advertisement

Polavaram latest news telugu(AP politics) : టీడీపీ నేతలు చేపట్టిన పోలవరం యాత్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రాజెక్టు వద్దకు వెళుతుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. కొందరు టీడీపీ నేతలు ఏలూరు నుంచి గోపాలపురం మీదుగా పోలవరం బయలుదేరారు. అయితే వారిని కొవ్వూరుపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

Advertisement

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, గన్ని వీరాంజనేయులు, బడేటి రాధాకృష్ణతోపాటు మరికొందరు పార్టీ నేతలను పోలీసులు ఆపేశారు. దీంతో టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా టీడీపీ నేతలు ప్రతిఘటించారు. దీంతో టీడీపీ నేతలను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు.

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలీసుల కళ్లుగప్పి బైక్ పై పోలవరం వైపు బయలేదారు. అయితే ఆయను పోలీసులు అదుపులోకి తీసుకుని కొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మిగిలిన టీడీపీ నేతలను గోపాలపురం పీఎస్ కు తరలించారు. మరోవైపు పోలవరం వద్ద పోలీసులు భారీగా సిబ్బందిని మోహరించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×