E-Paper
Advertisement

Boy Murder : బాలుడి హత్య కేసు.. రాజకీయ ప్రమేయం ఉందా..? పోలీసుల క్లారిటీ..

Boy Murder : బాలుడి హత్య కేసు.. రాజకీయ ప్రమేయం ఉందా..? పోలీసుల క్లారిటీ..
Advertisement

Boy Murder : బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పలవారిపాలెంలో టెన్త్‌ స్టూడెంట్‌ అమర్నాథ్‌ సజీవదహనంపై బంధువులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో నిరసన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ హత్య కేసు దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని ఆరోపణలు వచ్చాయి. రాజకీయ ప్రమేయం ఉందని విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ స్పష్టం చేశారు.

Advertisement

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఉప్పాల అమర్‌నాథ్‌ అనే బాలుడికి బాల్యంలోనే తండ్రి చనిపోయాడు. ఆ బాలుడు తల్లి, సోదరి, తాతయ్యతో కలిసి ఉంటున్నాడు. రాజోలు పంచాయతీ పరిధిలోని రెడ్లపాలేనికి చెందిన యువకుడు వెంకటేశ్వరరెడ్డి ప్రేమ పేరుతో తన అక్కను వేధిస్తున్నాడని అమర్‌నాథ్‌ నిలదీశాడు. దీంతో నిందితుడు అతడిపై కక్ష పెంచుకున్నాడు. అమర్‌నాథ్‌ను హత్య చేయాలని ప్లాన్ చేసి పెట్రోల్‌ కొన్నాడు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో అమర్‌నాథ్‌ ట్యూషన్ కు వెళుతుండగా కొందరు స్నేహితులతో కలిసి వెంటేశ్వరరెడ్డి అడ్డగించాడు. మొక్కజొన్న బస్తాల ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి అతడి ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు.

ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని, మరో నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్పీ వెల్లడించారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సాంకేతికంగా అన్ని ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. హత్య జరిగిన స్థలంలో నిందితుడు ఉపయోగించిన పెట్రోల్‌ బాటిల్‌ను స్వాధీనం చేసుకుని వేలిముద్రలను సేకరించామని చెప్పారు. అమర్‌నాథ్‌ చనిపోయేముందు ఇచ్చిన మరణ వాంగ్మూలాన్ని వీడియో రూపంలో సేకరించామన్నారు.

Advertisement

ఈ కేసును ఫాస్ట్‌ ట్రాక్‌ చేసి దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మృతుడు, నిందితుడి కుటుంబాలకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని తెలిపారు. ఈ హత్యకు రాజకీయాలు ఆపాదించడం సరికాదన్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు రియాక్ట్‌ అయ్యారని .. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేశామన్నారు. ఈ కేసు దర్యాప్తును పారదర్శకంగా చేస్తున్నామని ఎస్పీ స్పష్టం చేశారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణను బాలుడి బంధువులు, స్థానికులు అడ్డుకున్నారు. తీరిగ్గా పరామర్శించేందుకు వచ్చారా? అంటూ నిలదీశారు. తాను వ్యక్తిగతంగా రూ.లక్ష పరిహారం అందించేందుకు వచ్చానని మోపిదేవి చెప్పారు. అయితే తామే రూ.లక్ష ఇస్తాం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని గ్రామస్థులు హెచ్చరించారు. దీంతో మోపిదేవి బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండానే వెళ్లిపోయారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×