E-Paper
Advertisement

PM Modi : చంద్రబాబును చూసే నేర్చుకున్నా.. బాబును మించిన వాళ్లు లేరు.. తెగపొగిడేసిన మోదీ..

PM Modi : చంద్రబాబును చూసే నేర్చుకున్నా.. బాబును మించిన వాళ్లు లేరు.. తెగపొగిడేసిన మోదీ..
Advertisement

PM Modi : ఇంద్రలోక రాజధాని అమరావతి అని.. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని.. అమరావతి ఒక శక్తి అన్నారు ప్రధాని మోదీ. ఐటీ, ఏఐ, విద్యా, ఆరోగ్య రంగాల్లో అమరావతి దేశంలోనే ప్రధాన నగరంగా ఉండబోతోందని చెప్పారు. రికార్డు స్పీడ్‌తో పనులన్నీ పూర్తి చేస్తామని, కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

చంద్రబాబును చూసే నేర్చుకున్నా..

Advertisement

తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు.. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌లో ఐటీని ఎలా డెవలప్‌ చేస్తున్నారో తాను తెలుసుకున్నానని చెప్పారు. అందుకోసం ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించి చంద్రబాబు పనితీరును పరిశీలించానని అన్నారు. లార్జ్ స్కేల్‌లో భారీ ప్రాజెక్టులు చేపట్టాలన్నా, వాటిని వేగంగా పూర్తి చేయాలన్నా.. చంద్రబాబును మించిన వాళ్లు దేశంలోనే లేరని ప్రశంసించారు ప్రధాని మోదీ.

కలిసి పని చేద్దాం..

Advertisement

ఏపీ సరైన మార్గంలో, సరైన వేగంతో ముందుకు సాగుతోందన్నారు మోదీ. సీఎం చంద్రబాబు ఆకాంక్షించినట్టు.. మూడేళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తే.. ఏపీ జీడీపీ ఊహించలేని స్థాయికి పెరుగుతుందని.. అది రాష్ట్ర చరిత్రను మార్చేస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కలిసి పని చేస్తానని హామీ ఇచ్చారు ప్రధాని.

ఎన్టీఆర్ కలలు.. మనమే నిజం చేయాలి..

ఆంధ్రప్రదేశ్ పురోగతి కోసం ఎన్టీఆర్ ఎన్నో కలలు కన్నారని.. వికసిత్ అమరావతితో ఆ కలలను కూటమి ప్రభుత్వమైన మనమే నిజం చేయాలంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు పిలుపు ఇచ్చారు పీఎం మోదీ. 60 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు తాను శంకుస్థాపన చేశానని.. అవి ఆంధ్రప్రదేశ్ ఆశలకు బలమైన పునాది వేస్తాయని తెలిపారు. నవ్య అమరావతి, నవ్య ఆంధ్రతో తన కల నిజం కాబోతోందన్నారు ప్రధాని మోదీ. 2015లో అమరావతికి తానే శంకుస్థాపన చేశానని.. అప్పటి నుంచీ కేంద్రం తరఫున అన్ని రకాల తోడ్పాటు అందిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.

Also Read : మోదీ ముందే.. వైసీపీని ఆటాడేసుకున్న లోకేశ్, పవన్

తల్లీ దుర్గా భవానీ కొలువున్న పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం తనకు ఆనందంగా ఉందంటూ తెలుగులో స్పీచ్ స్టార్ట్ చేశారు ప్రధాని మోదీ. అమరలింగేశ్వరుడికి, తిరుమల బాలాజీకి ప్రణామాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలుగులో చెప్పారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×