E-Paper
Advertisement

NTR : ఎన్టీఆర్ కు మోదీ వందనం.. మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రశంసలు..

NTR : ఎన్టీఆర్ కు మోదీ వందనం.. మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రశంసలు..
Advertisement

NTR : నందమూరి తారక రామారావు కోట్లాది ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించారని ప్రధాని మోదీ అన్నారు. 101వ మన్‌ కీ బాత్‌ ఎపిసోడ్‌లో ప్రధాని ప్రసంగించారు. ఈ సమయంలో శత జయంతి వేళ ఎన్టీఆర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. రాజకీయాలతోపాటు చిత్రరంగంలో తన ప్రతిభతో ఆ మహనీయుడు చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. తన నటనాకౌశలంతో ఎన్నో చరిత్రాత్మక పాత్రలకు ఎన్టీఆర్‌ జీవం పోశారని గుర్తు చేశారు.

బహుముఖ ప్రజ్ఞతో ఎన్టీఆర్‌ సినీరంగంలో పేరు తెచ్చుకున్నారని మోదీ కొనియాడారు. కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోయారన్నారు. 300పైగా చిత్రాల్లో నటించి అలరించారని పేర్కొన్నారు. రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఎన్టీఆర్‌ నటనను ఇప్పటికీ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారని మోదీ చెప్పారు.

Advertisement

దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం వచ్చే 25 ఏళ్లు చాలా కీలకమని మోదీ అన్నారు. ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ్‌ భారత్‌ నినాదాన్ని అందరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. యువ సంగమం పేరుతో విద్యాశాఖ ఓ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. ప్రజలతో మమేకం చేయడం ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ప్రధాని మోదీ తెలిపారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×