E-Paper
Advertisement

Pinnelli in Narasaraopeta : పిన్నెల్లిపై పోలీసుల నిఘా.. అరెస్టుకు రంగం సిద్ధం ?

Pinnelli in Narasaraopeta : పిన్నెల్లిపై పోలీసుల నిఘా.. అరెస్టుకు రంగం సిద్ధం ?
Advertisement

Police deployed, Pinnelli staying at Narasaraopeta: ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. నేటితో ఆయనకు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ముగియనుంది. కోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియడంతో పిన్నెల్లిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో పిన్నెల్లి తలదాచుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పిన్నెల్లి మరోసారి తప్పించుకోకుండా.. పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. అనిల్ కుమార్ యాదవ్ ఇంటి వద్ద పోలీసులు మరింత భద్రతను పెంచారు. పిన్నెల్లిపై పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సహా.. 3 హత్యాయత్నం కేసులు ఎదుర్కొంటున్నారు పిన్నెల్లి.

మే 13న ఏపీలో ఎన్నికల పోలింగ్ జరుగగా.. అదేరోజున పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విధ్వంసం సృష్టించారు. పోలింగ్ బూత్ లో ఈవీఎం ను పగులగొట్టి హడావిడి చేసిన వీడియో బయటికి రావడంతో.. ఏపీలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఆ తర్వాత మహిళను దుర్భాషలాడటం, సీఐపై చేయి చేసుకోవడం, టీడీపీ ఏజెంట్ పై హత్యాయత్నం.. ఇలా పిన్నెల్లిపై నాలుగు కేసులు ఫైల్ అవ్వగా.. అరెస్ట్ భయంతో తెలంగాణ నుంచి పారిపోయేందుకు స్కెచ్ వేశారు. పిన్నెల్లిని అదుపులోకి తీసుకునేందుకు మాచర్ల పోలీసులు వెంబడించగా.. సినీ ఫక్కీలో ఆయన తప్పించుకున్నారు.

Advertisement

Also Read : పిన్నెల్లికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పుపై ఆగ్రహం

మే 23న హై కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు.. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో జూన్ 5 వరకూ ఆయనపై చర్యలు తీసుకొవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చింది. పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మే 27న మరో మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరగా.. మే 28న బెయిల్ మంజూరైంది. జూన్ 6కు కేసును వాయిదా వేసింది.

Advertisement

పిన్నెల్లిపై ఉన్న కేసులను విచారణకు తీసుకోకుండా బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. జూన్ 6న పూర్తి విచారణ చేసి.. కేసును క్లోజ్ చేయాలని హైకోర్టును ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. నాలుగు కేసుల్లో ఆయన్ను జూన్ 6 వరకూ అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వడాన్ని తప్పుబట్టింది. ఇది న్యాయాన్ని అపహాస్యం చేసేలా ఉందని అసహనం వ్యక్తం చేసింది.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×