E-Paper
Advertisement

Pinnelli Ramakrishna: ప్లీజ్ బెయిల్ ఇవ్వండి.. పిన్నెల్లి రిక్వెస్ట్

Pinnelli Ramakrishna: ప్లీజ్ బెయిల్ ఇవ్వండి.. పిన్నెల్లి రిక్వెస్ట్
Advertisement

Pinnelli Ramakrishna latest news(Andhra politics news): వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా పిన్నెల్లి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని.. కానీ తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. రాజకీయ పెద్దల ప్రోద్బలంతో తనను పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారని పిన్నెల్లి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు సోమవారం విచారణకు రానున్నాయి.

ఏపీ పోలింగ్ రోజు రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడంతో పాటు అడ్డుకోబోయిన టీడీపీ పోలింగ్ ఏజెంట్‌పై దాడి చేయడంతో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై పల్నాడు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోబోయిన సీఐపై దాడి చేసిన కేసుల్లో పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు, అనుచరులపై కేసులు నమోదు చేశారు.

Advertisement

Also Read: జగన్ లక్షల కోట్లు దోచేశాడు.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ

ఈ కేసుల్లో పిన్నెల్లిని జూన్ 26వ తేదీన అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో అప్పటి నుంచి నెల్లూరు సెంట్రల్ జైలులో పిన్నెల్లి ఉన్నారు. ఈ కేసుల్లో దిగువ కోర్టులో 2 సార్లు బెయిల్ కోసం ప్రయత్నించగా న్యాయస్థానం వాటిని కొట్టివేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×