E-Paper
Advertisement

Ongole : బాలినేని.. మాగుంట.. వైవీ.. తాడేపల్లికి ఒంగోలు పంచాయితీ..

Ongole : బాలినేని.. మాగుంట.. వైవీ.. తాడేపల్లికి ఒంగోలు పంచాయితీ..
Advertisement

Ongole : ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వైసీపీలో సీట్ల మార్పు కాకరేపుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాపై జగన్ ఫోకస్ పెట్టడంతో ఆ ప్రాంతం నేతల్లో గుబులు రేగుతోంది. ఈ క్రమంలోనే ఒంగోలు రాజకీయం తాడేపల్లి చేరుతోంది.

ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో సీఎం జగన్ సమావేశం కానున్నారు. నియోజకవర్గాల మార్పుపై ప్రధానంగా చర్చ జరగనుందని సమాచారం. కొన్నాళ్లుగా పార్టీ నాయకత్వం తీరుపై బాలినేని అసంతృప్తితో ఉన్నారు. తన నియోజకవర్గంలో కొందరి పెత్తనం ఏంటంటూ ఆయన నిలదీస్తున్నారు. ఇప్పటికే దఫదఫాలుగా చర్చలు జరిపారు.

Advertisement

నియోజకవర్గాల మార్పుపై సీఎం జగన్ మరోసారి చర్చించనున్నారని తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డిని ఒంగోలు నుంచి పార్లమెంట్‌కు పోటీ చేయిస్తారనే టాక్ నడుస్తోంది. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవను మార్కాపురం నుంచి అసెంబ్లీకి బరిలో నిలపాలనే ప్రతిపాదన కూడా ఉందని తెలుస్తోంది. అటు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బాలినేనికి స్థానచలనం తప్పదనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీట్ల మార్పు జగన్ తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×