E-Paper
Advertisement

Magunta Sreenivasulu Reddy: వైసీపీకి ఎంపీ మాగుంట గుడ్ బై..

Magunta Sreenivasulu Reddy: వైసీపీకి ఎంపీ మాగుంట గుడ్ బై..
Advertisement

magunta srinivasulu reddy latest news

Magunta Sreenivasulu Reddy Resigned to YCP(Andhra politics news): వైసీపీకి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గుడ్ బై చెప్పారు. అనివార్య కారణాల వలన వైసీపీని వీడుతున్నట్లు తెలిపారు. ప్రస్థతం మాగుంట ఒంగోలు ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు.

Advertisement

ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. 33 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని 11 సార్లు చట్టసభలకు పోటీ చేశానని తెలిపారు. ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని స్పష్టం చేశారు. తమకు అహం లేదని.. ఆత్మాభిమానం మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఐదేళ్లు సహాయసహకారలందించిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మాంగుట రాజీనామాతో వైసీపీని వీడిన ఎంపీల సంఖ్య ఆరుకు చేరింది. ఐదుగురు లోక్ సభ ఎంపీలు కాగా.. ఒకరు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజీనామా చేసిన వారిలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఉన్నారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×