E-Paper
Advertisement

Kesineni Nani: కేశినేని నానికి నో టిక్కెట్.. తేల్చేసిన టీడీపీ అధిష్టానం

Kesineni Nani: కేశినేని నానికి నో టిక్కెట్.. తేల్చేసిన టీడీపీ అధిష్టానం
Advertisement

Kesineni Nani: ఏపీ రాజకీయాలు ఎప్పుడెలా ఉంటాయో ఎవరి ఊహకు అంతుచిక్కడం లేదు. వైసీపీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో చాలా మందికి సీఎం జగన్ మొండి చేయి చూపించడంతో ఆ పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. మరోవైపు జగన్ సోదరి షర్మిల.. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని.. ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. షర్మిల రాకతో వైసీపీ అసంతృప్తులంతా కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి.

ఎప్పటి నుండో విజయవాడ ఎంపీ సీటుపై జరుగుతున్న రగడపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఎంపీ సీటు కోసం కేశినేని బ్రదర్స్ మధ్య తీవ్ర పోటీ ఉండగా.. టీడీపీ అధిష్టానం దానిపై క్లారిటీ ఇచ్చింది. దీంతో కేశినేని బ్రదర్స్ వివాదానికి కూడా ఎండ్ కార్డు వేసింది. మరోసారి కేశినేని నానికి టికెట్‌ లేదని హైకమాండ్‌ తేల్చి చెప్పింది. అటు తిరువూరులో చంద్రబాబు సభ బాధ్యతలు కేశినేని చిన్నికి అప్పగించింది. పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించింది.

Advertisement

ఆలపాటి రాజా, కొనకళ్ల నారాయణ,నెట్టెం రఘురాం.. రాత్రి కేశినేని నానిని కలిశారు. చంద్రబాబు ఆదేశాలను నానికి చేరవేశారు. పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దన్న చంద్రబాబు ఆదేశాలను శిరసావహిస్తానని నాని వారితో చెప్పారు.

.

Advertisement

.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×