E-Paper
Advertisement

New Liquor Policy: ఏపీలో నూతన మద్యం విధానం.. ఎప్పట్నుంచంటే?

New Liquor Policy: ఏపీలో నూతన మద్యం విధానం.. ఎప్పట్నుంచంటే?
Advertisement

AP’s New Liquor Policy: నూతన మద్యం విధానాన్ని రూపొందించడంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. కొత్త విధానం రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. మొత్తం 6 రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం.. ఇందుకోసం అధికారులతో కూడిన నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులతో కూడిన మొత్తం 4 బృందాలను ఏర్పాటు చేసింది.

రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ఈ నాలుగు బృందాలు వెళ్లనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న ఎక్సైజ్ పాలసీ విధానం, మద్యం షాపులు, బార్లు, మద్యం కొనుగోళ్లు, ధరలు, నాణ్యత, చెల్లింపుల విధానం, డిజిటల్ పేమెంట్ అంశాలపై ఈ బృందాలు అధ్యయనం చేస్తాయి. అదేవిధంగా ట్రాక్ అండ్ ట్రేస్, డీ అడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాలపై కూడా ఈ బృందాలు దృష్టిసారిస్తాయి.

Advertisement

Also Read: శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఏపీలో కూడా మెట్రో రైల్

ఆయా రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలపై ప్రభుత్వానికి ఈ బృందాలు ఓ నివేదికను అందజేస్తాయి. ఈ నెల 12 లోగా నివేదకలు సమర్పించాలని ఈ నాలుగు అధ్యయన బృందాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే నెల 1 అనగా అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమయ్యింది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×