E-Paper
Advertisement

Nellore : బాబాయ్ Vs అబ్బాయ్.. నెల్లూరు సిటీలో కత్తులు దూసిన కక్షలు..

Nellore : బాబాయ్ Vs అబ్బాయ్.. నెల్లూరు సిటీలో కత్తులు దూసిన కక్షలు..
Advertisement

Nellore : ‘అల్పబుద్ధివానికధికారమిచ్చిన..

దొడ్డవారినెల్ల తొలగగొట్టు..

Advertisement

చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా..

విశ్వదాభిరామ! వినుర వేమ!!’’

Advertisement

తాత్పర్యం : అల్పుడికి అధికారమిస్తే మంచివారిని పక్కనపెడతాడు. చెప్పుతినే కుక్కకు చెరకు తీపి తెలియనట్లే చెడ్డవారికి మంచివారి విలువ తెలియదు.

ఈ పద్యాన్ని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను ఉద్దేశించి నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ చెప్పారు. రూప్ కుమార్ యాదవ్ ఎవరోకాదు. స్వయనా అనిల్ కుమార్ యాదవ్ కు బాబాయ్. వారి ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అనుచరులను చంపే ప్రయత్నాల వరకు కక్షలు పెరిగాయి. రూప్ కుమార్ యాదవ్ అనుచరుడు, వైసీపీ విద్యార్థి విభాగం నేత హాజీపై శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. బాధితుడు ప్రస్తుతం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హాజీని తాజాగా రూప్‌కుమార్ యాదవ్‌ పరామర్శించారు. ఈ దాడిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

వైసీపీ ఆవిర్భావం నుంచి హాజీ పార్టీలో ఉన్నారని రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. తనతో ఉన్నాడనే కక్షతోనే హాజీపై కత్తులతో హత్యాయత్నం చేశారని ఆరోపించారు. ఈ దాడి వెనుక బాధితుడు చెప్పిన విధంగానే ఎమ్మెల్యే అనిల్‌ కుమార్ యాదవ్‌ ఉన్నారన్నారు. ఇలాంటి దాడులు చేయడం మంచిది కాదని హితువు పలికారు. గతంలోనూ తన అనుచరులపై దాడులు చేశారని తెలిపారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే ఈ దాడి జరిగి ఉండేది కాదన్నారు.

ఇకపై తన కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని రూప్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తాను ప్రతీకారం మొదలుపెడితే ఏం జరుగుతుందో ఊహకు కూడా అందదని హెచ్చరించారు. ఈ ఘటనను సీఎం జగన్‌, పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. నెల్లూరులో వైసీపీని సర్వనాశనం చేస్తున్నారని రూప్‌కుమార్ యాదవ్‌ విమర్శించారు.

అసలే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీలో కుమ్మలాటలు పెరిగాయి. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించే నేతల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముగ్గురు ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు మరో వివాదం వైసీపీ అధిష్టానానికి తలనొప్పులు తెచ్చింది. ఈ వివాదంపై పార్టీ అధినేత జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. బాబాయ్, అబ్బాయ్ మధ్య సయోధ్య కుదురుస్తారా..?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×