E-Paper
Advertisement

Nandamuri Balakrishna : సమయం లేదు మిత్రమా.. విజయమా..? వీర స్వర్గమా?

Nandamuri Balakrishna : సమయం లేదు మిత్రమా.. విజయమా..? వీర స్వర్గమా?
Advertisement

Nandamuri Balakrishna : వైసీపీ అక్రమాలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయవనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వద్ద నిర్విహంచిన సభలో పాల్గొన్న బాలయ్య.. లోకేశ్‌ పాదయాత్రలో ప్రజాగళం కదంతొక్కిందన్నారు. యువగళం యాత్రకు అనేక ఇబ్బందులు కల్గించినా పూర్తి చేశారని తెలిపారు.

ప్రజా సమస్యలపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ పోరాడుతున్నారని బాలకృష్ణ అన్నారు. ఏపీలో చెత్త ప్రభుత్వం ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. అమరావతిని అభివృద్ధి చేయలేదని విమర్శించారు.రాజధానికి భూములిచ్చిన రైతుల ఉద్యమాన్ని అణచివేశారన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు.

Advertisement

ఏపీలో డ్రగ్స్‌ మాఫియా రాజ్యమేలుతోందని బాలయ్య విమర్శించారు. భూములు, ఇసుక స్కాములతో వేలాది కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఏపీలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాలేదన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు లేకుండాపోయాయన్నారు. వైసీపీ అక్రమాలు ఇలాగే కొనసాగితే వరల్డ్ మ్యాప్ లో ఏపీ కనిపించదని హెచ్చరించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిప్డారు. సమయం లేదు మిత్రమా.. విజయమా.. వీర స్వర్గమా? తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.ఏపీ భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందని నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×