E-Paper
Advertisement

Naga Babu : రాజకీయ పదవులపై ఆసక్తి లేదు.. ఎంపీగా పోటీ చేస్తున్నాననేది అవాస్తవం..

Naga Babu : రాజకీయ పదవులపై ఆసక్తి లేదు.. ఎంపీగా పోటీ చేస్తున్నాననేది అవాస్తవం..
Advertisement

Naga Babu : రాజకీయ పదవులపై తనకు ఆసక్తి లేదని, వచ్చే ఎన్నికలలో ఎంపీగా పోటీ చేస్తున్నాననే విషయంలో నిజం లేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. అక్రమ గ్రావెల్ పై సోమిరెడ్డి చేస్తున్న పోరాట దీక్షకు సమయం లేనందున వెళ్ళలేకపోతున్నాని తెలిపారు. తనకు ఫిల్మ్ నగర్ లో ఓటు ఉందని, మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో తనతో పాటు తన కుటుంబ సభ్యులెవరూ ఓటు వేయ్యలేదని తెలిపారు.

“మంగళగిరికి వచ్చేయడంతో నేను నా కుటుంబ సభ్యులు ఓటు హక్కు మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నాం. నా ఓటుని తెలంగాణలో రద్దు చేసుకున్నాను. తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ లో రెండుచోట్ల ఓట్లు ఉన్నాయన్న ఆరోపణలు అవాస్తవం” అని నాగబాబు తెలిపారు. వచ్చే ఎన్నికలలో టిడీపీ, జనసేన కి ఓటు వేస్తానని అన్నారు. పార్టీలో విభేధాలు ఉండటం సర్వసాధారణ అంశమని.. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో జనసేనపార్టీ నుంచి మా అభ్యర్థి పోటి చేస్తారని తెలిపారు.

Advertisement

నిజమైన నాయకుడు ఎవ్వరూ ప్రతిపక్షం ఉండకూడదు అనే ఆలోచనతో ఉండరని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వై నాట్ 175 అంటున్నారని.. వై నాట్ వైసీపీ జీరో అని తాము అంటున్నామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీకి 20 నుంచి 25 సీట్లు రావని.. వారు ప్రతిపక్షంలో ఉంటారని తెలిపారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×