E-Paper
Advertisement

AP Culture District: ఏపీలో కొత్త జిల్లా.. ఇక్కడన్నీ స్పెషల్.. ఒక్కసారి వెళ్లారంటే మళ్లీ రాలేరు!

AP Culture District: ఏపీలో కొత్త జిల్లా.. ఇక్కడన్నీ స్పెషల్.. ఒక్కసారి వెళ్లారంటే మళ్లీ రాలేరు!
Advertisement

AP Culture District: ఓ జిల్లా.. ఇంతవరకు మీరు ఊహించనిది. అక్కడ అడుగుపెడితే మీరు చూస్తుందీ వైవిధ్యం, వినిపిస్తోంది కొత్త స్వరం కానీ అక్కడికి ఒక్కసారి వెళ్లినవారు మాత్రం మళ్లీ తిరిగిరాలేరు అంటున్నారు. అదెలా సాధ్యమంటారా? ఏపీలో కొత్తగా ఏర్పడిన ఈ ప్రత్యేక జిల్లా గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? అక్కడికి వెళ్లినవారి కళ్లలో మిగిలిపోయే కళ ఏంటి? ఆ ప్రకృతి, ఆధ్యాత్మికత, సంస్కృతి, రహస్యాల మేళవింపుతో పాటు, ఏదో తెలియని ఆకర్షణ.. అన్ని కలిపి ఆ జిల్లాని మిస్టీరియస్‌గాను, మాయమైన ప్రదేశంగానూ మార్చేస్తున్నాయట. ఇంతకీ మీరే చూడండి.. ఎందుకు అక్కడికి ఒక్కసారి వెళ్లినవారు మళ్లీ తిరిగిరాలేరు అన్నదానికి సమాధానం ఏమిటో తెలియాలంటే.. ఈ కథనం తప్పక చదవండి.

Advertisement

అమరావతి నగరం మరోసారి సంచలనాత్మక ప్రణాళికతో వార్తల్లోకి ఎక్కింది. కొత్తగా నిర్మించబోతున్న 250 ఎకరాల సాంస్కృతిక జిల్లా (Culture District) కృష్ణా నదీ తీరాన నగరానికి సరికొత్త మహిమను తీసుకురానుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ప్రజల మానసిక ప్రశాంతత, సాంస్కృతిక విలువలు, పర్యాటక అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి గర్వకారణంగా నిలుస్తుందనే లక్ష్యంతో రూపొందించబడుతోంది.

ప్రకృతి ఒడిలో సాంస్కృతిక వైభవం
ఈ సాంస్కృతిక జిల్లాను కృష్ణా నది ఒడ్డున నిర్మించనున్నారు. ప్రకృతితో మమేకమవుతూ కళలకు ప్రాధాన్యతనిచ్చేలా శిల్పకళతో మిక్సైన మౌలిక సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. నది తీరాన్ని అందంగా తీర్చిదిద్దుతూ, అక్కడ ప్రోమెనేడ్, గ్రీన్ లాన్లు, నది ఘాట్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఇవి ప్రజలకు తీరిక సమయంలో స్వేచ్ఛగా విహరించేందుకు, ప్రకృతిని ఆస్వాదించేందుకు, కుటుంబ సమేతంగా రిలాక్స్ కావడానికి చాలా అనుకూలంగా ఉంటాయి.

Advertisement

క్రాఫ్ట్ విలేజ్.. కార్మికుల కళలకు నిలయం
ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన ఆకర్షణగా ఉండబోయే అంశాల్లో ఒకటి క్రాఫ్ట్ విలేజ్. ఇక్కడ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల హస్తకళలకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక గదులు, ప్రదర్శన ప్రదేశాలు ఏర్పాటవుతాయి. చెక్కబొమ్మలు, పొతరాజులు, బొబ్బిలి వీణలు, నరసాపురం లేస్.. ప్రతి ప్రాంతపు ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేసే అవకాశం ఈ విలేజ్‌లో లభిస్తుంది. ఇది పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా, స్థానిక కళాకారులకు ఆదాయ వనరులుగా మారుతుంది.

సాంస్కృతిక కేంద్రం.. కళలకు వేదిక
ఈ సాంస్కృతిక జిల్లాలో ఒక పెద్ద సాంస్కృతిక కేంద్రం (Cultural Centre) కూడా నిర్మించనున్నారు. ఇది సంగీత, నాటకం, నృత్యం, కళల ప్రదర్శనలకు కేంద్రంగా పనిచేస్తుంది. చిన్న చిన్న ప్రదర్శనల నుంచి జాతీయ స్థాయి కళారూపాలకు ఇక్కడ వేదిక లభిస్తుంది. కళా ప్రదర్శనలతో పాటు, విద్యార్థులకు శిక్షణ కేంద్రాలుగా కూడా ఉపయోగపడే అవకాశముంది.

ఎంఫితియేటర్.. అందరికీ అందుబాటులో కళ
ఈ ప్రాజెక్ట్‌లో ఒక ఎంఫితియేటర్ (amphitheatre) కూడా రూపొందించనున్నారు. ఇది ఓపెన్ ఎయిర్ స్టేజ్ లాంటి వేదికగా, సూర్యాస్తమయం నేపథ్యంలో నదీ తీరంలో కళలతో ఆనందించేందుకు ప్రజలకు స్వర్గం లాంటి అనుభూతిని కలిగించనుంది. సంగీత కార్యక్రమాలు, డ్యాన్స్ షోలు, థియేటర్లు, ఫిలిం ఫెస్టివల్స్ వంటి వాటికి ఇది ముఖ్య వేదికగా మారుతుంది.

హై స్ట్రీట్.. షాపింగ్, ఫుడ్, ఫన్ అన్నీ ఒకే చోట
ప్రాజెక్ట్‌లో భాగంగా ఒక హై స్ట్రీట్ కూడా నిర్మించనున్నారు. ఇది ప్రఖ్యాత ఫుడ్ స్ట్రీట్లకు దీటుగా ఉంటుంది. రుచికరమైన ఆహారపు కేంద్రాలు, బ్రాండ్ షాపులు, బుక్ స్టోర్లు, క్యాఫేలు, బొమ్మల షాపులు ఇలా ఎన్నో ఏర్పడతాయి. యువతకు ఇది ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆహారం, షాపింగ్, మ్యూజిక్ అన్నీ ఒకే చోట ఉండేలా ప్రణాళిక సిద్ధమవుతోంది.

Also Read: Uttarakhand floods: ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌బరస్ట్.. రెప్పపాటులో కొట్టుకెళ్లిపోయిన ఇళ్లు.. భారీ సంఖ్యలో మరణాలు?

పిల్లల ఆటల ప్రదేశాలు, సెల్ఫీ స్పాట్లు.. కుటుంబ విహారానికి పర్‌ఫెక్ట్ డెస్టినేషన్
పిల్లల కోసం ప్రత్యేకంగా ఆటల ప్రదేశాలు (Kids play areas) ఏర్పాటు చేయనున్నారు. సురక్షితమైన, సృజనాత్మక ఆవిష్కరణలతో పిల్లలు ఆడుకుంటూ నేర్చుకునేలా డిజైన్ చేస్తారు.

అలాగే, సోషల్ మీడియా యుగానికి తగ్గట్టుగా ప్రత్యేక సెల్ఫీ స్పాట్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇవి పర్యాటకులను ఆకట్టుకునేలా, గుర్తుండిపోయే ఫోటోలకు ఓ స్థలంగా ఉంటాయి.

పూర్తి ప్రణాళిక త్వరలో.. అమరావతి భవిష్యత్తు భరోసా!
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పూర్తి ప్రణాళికలు తుదిదశలో ఉన్నాయి. అవసరమైన మౌలిక సదుపాయాల డిజైన్, ఆర్కిటెక్చర్ ప్లాన్‌లు, పర్యావరణ అనుమతులు, భద్రతా ప్రమాణాలు అన్నీ సిద్ధం చేసిన తరువాత పనులు ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రాష్ట్ర గౌరవంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తోంది.

మరొక కోణం.. ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం
ఈ సాంస్కృతిక జిల్లా ద్వారా స్థానికంగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. కళాకారులకు మార్కెట్ లభిస్తుంది. పర్యాటక రంగంలో అభివృద్ధి వేగవంతం అవుతుంది. రాష్ట్ర పర్యాటక శాఖకు ఆదాయం వస్తుంది. ముఖ్యంగా నదీ తీరాన్ని ప్రజలకు తిరిగి ఇవ్వడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగవుతాయి.

అమరావతిని మాత్రమే రాజధానిగా కాకుండా.. ఆధ్యాత్మికత, ప్రకృతి, కళల మేళవింపుగా తీర్చిదిద్దే ఈ ప్రయత్నం ప్రశంసనీయమైనది. ప్రజల జీవనశైలి, పర్యాటక ఆదాయం, రాష్ట్ర గౌరవం అన్నింటికీ ఇది దోహదపడనుంది. త్వరలో పూర్తయ్యే ఈ కల నిజమవుతుందని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×