E-Paper
Advertisement

Modi in Tirumala : శ్రీవారి సేవలో ప్రధాని.. రెండు నియోజకవర్గాల్లో ప్రచారం

Modi in Tirumala : శ్రీవారి సేవలో ప్రధాని.. రెండు నియోజకవర్గాల్లో ప్రచారం
Advertisement
Modi in Tirumala

Modi in Tirumala(Andhra news updates):

ప్రధాని నరేంద్రమోదీ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన ప్రధాని.. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ప్రధానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మహాద్వారం వద్ద స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పండితులు వేద ఆశీర్వాదాలు ఇచ్చారు. రంగనాయకుల మండపంలో మోదీకి వేదాశీర్వచనం చేశారు.

స్వామివారిని దర్శించుకున్న అనంతరం.. టీటీడీ చైర్మన్ భూమన, ఈఓ ధర్మారెడ్డి శ్రీవారి పట్టువస్త్రంతో ప్రధానిని సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారి చిత్రపటం, 2024 క్యాలెండర్, డైరీలను టీటీడీ అధికారులు మోదీకి అందజేశారు. కాగా.. ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుమల గిరులపై భద్రతను కట్టుదిట్టం చేశారు. 2 వేలమంది పోలీసులతో బందోబస్త్ నిర్వహించారు. మోదీ స్టే చేసిన అతిథి గృహాలను ఎన్ఎస్ జీ టీమ్స్ ఆధీనంలోకి తీసుకున్నాయి.

Advertisement

తిరుమల పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని మోదీ.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నేడు మహబూబాబాద్, కరీంనగర్ లో జరగనున్న బహిరంగ సభల్లో పాల్గొని, సాయంత్రం హైదరాబాద్ రోడ్ షో లో పాల్గొననున్నారు.

.

Advertisement

.

.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×