E-Paper
Advertisement

Nara Lokesh : లోకేశ్‌తో వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం భేటీ.. త్వరలో టీడీపీలోకి..!

Nara Lokesh : లోకేశ్‌తో వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం భేటీ.. త్వరలో టీడీపీలోకి..!
Advertisement

Nara Lokesh : సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం మంగళవారం హైదరాబాద్‌లో నారా లోకేశ్‌ను కలిశారు. టీడీపీలో చేరేందుకు లోకేశ్ తో ఆయన కుమారుడితో కలిసి చర్చలు జరిపినట్లు సమాచారం . ఇటీవల మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర ఆరోపనలు చేసిన ఆదిమూలం పార్టీ మారనున్నట్లు తెలిసింది .

సత్యవేడు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ సెగ్మెంట్. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం స్థానంలో ఈ సారి తిరుపతి ఎంపీ గురుమూర్తిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని వైసీపీ అధిస్టానం భావించింది. అదే సమయంలో ఆదిమూలంను తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. ఎమ్మెల్యేగా ఉండటానికే మొగ్గుచూపిన ఆదిమూలం సడన్‌గా అధిష్టానాన్ని ధిక్కరించేలా మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తిరుపతిలో ఏర్పాటు చేసిన సత్యవీడు నాయకుల ఆత్మీయ సభకు మంత్రి పెద్దిరెడ్డి ఆహ్వానించలేదని ఆదిమూలం తీవ్ర ఆరోపనలు చేశారు. అంతేకాకుండా తన నియోజకవర్గంలో ఇసుక దందా వెనక పెద్దిరెడ్డి ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో దుమారం రేపాయి. ఈ సందర్భంలోనే లోకేశ్ తో ఆదిమూలం భేటీ అవ్వడంతో త్వరలో టీడీపీలోకి చేరబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×