E-Paper
Advertisement

Tirupati : బిర్యానీ తిన్న వ్యక్తికి.. గిఫ్ట్ గా రూ .7 లక్షల కారు

Tirupati : బిర్యానీ తిన్న వ్యక్తికి.. గిఫ్ట్ గా రూ .7 లక్షల కారు
Advertisement

Tirupati : పండగైనా , పెళ్ళైనా, పుట్టిన రోజైనా , పార్టీ అయినా.. ఏదైనా స్పెషల్ డే అయితే చాలు కేక్ కంటే ముందు బిర్యానీనే కావాలంటారు. అది లేనిదే పార్టీ ఉండదు. పార్టీ అంటే బిర్యాని.. బిర్యాని అంటే పార్టీ.. అదీ ఇప్పుడు బిర్యానీకి ఉన్న క్రేజ్. ప్రతి ఒక్కరూ నోటి రుచి కోసం బిర్యానీని కోరుకుంటున్నారు. గతేడాదిలో బిర్యానీల కోసం చాలా ఖర్చు చేసి ఉంటారు కదా. మరి బిర్యానీ మీకెప్పుడైనా లాభం తెచ్చిపెట్టిందా ? ఒక వ్యక్తికి బిర్యానీనే వరంలా మారింది. ఒకటి కాదు రెండు కాదు.. అక్షరాలా రూ.7 లక్షల విలువైన కారును తన ఇంటికి తీసుకొచ్చింది. ఇంతకీ అదెలా జరిగిందో తెలుసుకుందాం.

తిరుపతిలో ఓ హోటల్ యజమాని కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని లక్కీ డ్రా నిర్వహించాడు. 2023 సెప్టెంబర్ లో తమ హోటల్ లో బిర్యానీ తిన్న ప్రతి ఒక్కరికి కూపన్ ఇచ్చారు. 23 వేల మంది కస్టమర్లకు పైగా కూపన్లు అందించారు. ఆ కూపన్లకు సంబంధించిన లక్కీ డ్రా డిసెంబర్ 31న నిర్వహించారు. రోబో హోటల్ అధినేత భరత్ కుమార్ రెడ్డి, తన భార్య నీలిమ డిసెంబర్ 31న లక్కీ డ్రా తీశారు. అందులో తిరుపతికి చెందిన రాహుల్ అనే వ్యక్తి విజేతగా నిలిచి.. రూ. 7 లక్షల విలువైన నిస్సాన్ మాగ్నైట్ కారును బహుమతిగా గెలుచుకున్నాడు. బిర్యానీ లక్కీ డ్రా లో ఇంత విలువైన కారు దక్కడంతో రాహుల్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×