E-Paper
Advertisement

Maha Shivaratri: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆల‌యాలు

Maha Shivaratri: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆల‌యాలు
Advertisement

Maha Shivaratri: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదినం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా ప్రారంభమైంది. శివనామ స్మరణతో శైవక్షేత్రాలన్నీ మారుమోగుతున్నాయి.తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర నదుల్లో స్నానాలు ఆచరించి, పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు ఆలయాల వద్ద క్యూ కట్టారు. పంచారామాలు, శ్రీశైలం, కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రాల్లో హరహర మహాదేవ శంభో శంకర అనే నాదాలు మిన్నంటుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కోటప్పకొండలో ప్రభల సందడి
గుంటూరు జిల్లాలోని ప్రముఖ క్షేత్రమైన కోటప్పకొండలో త్రికోటేశ్వరుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. సంప్రదాయబద్ధంగా బిందె తీర్థంతో తొలి పూజను నిర్వహించారు. ఈ వేడుకల్లో గుంటూరు ఐజీ త్రిపాఠి, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇక్కడ నిర్వహించే విద్యుత్ ప్రభల ఊరేగింపు ఈ వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

Advertisement

వేములవాడలో రాజన్న క్షేత్రం
దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి కోడెలను కట్టి స్వామివారిని దర్శించుకుంటున్నారు. సుమారు మూడు గంటలకు పైగా సమయం పడుతున్నప్పటికీ, భక్తులు ఓపికతో క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

కీసరగుట్టలో పట్టువస్త్రాల సమర్పణ
మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రమైంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వస్తున్న భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సుమారు 1500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం విశేషం.

Advertisement

శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల కోలాహలం
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. పాతాళగంగలో స్నానాలు ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాత్రి జరగబోయే లింగోద్భవ కాల మహన్యాస పూర్వక రుద్రాభిషేకం కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. శ్రీశైల గిరులు భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

Also Read: తిరుమల శ్రీవారికి అలంకరించే శిఖామణి గురించి తెలుసా..? ఇంకా ఏమేం అలంకరిస్తారంటే

జాగరణ, ప్రత్యేక ఏర్పాట్లు
మహాశివరాత్రి సందర్భంగా రాత్రంతా భక్తులు నిర్వహించే శివ జాగరణ కోసం ఆలయాల వద్ద ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు ఏర్పాటు చేశారు. వేములవాడ ఈవో రమాదేవి మాట్లాడుతూ.. భక్తులకు తాగునీరు, మజ్జిగ పంపిణీతో పాటు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున క్యూలైన్ల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×