E-Paper
Advertisement

Machilipatnam: వీరంగం సృష్టిస్తే వీపు విమానం మోత తప్పదు.. బందరు పోలీసుల వినూత్న శిక్ష!

Machilipatnam: వీరంగం సృష్టిస్తే వీపు విమానం మోత తప్పదు.. బందరు పోలీసుల వినూత్న శిక్ష!
Advertisement

Machilipatnam: మచిలీపట్నంలో గత రాత్రి వీరంగం సృష్టించిన తాగుబోతులకు పోలీసులు వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. మద్యం మత్తులో సామాన్యులపై దాడికి తెగబడిన నిందితులను నడిరోడ్డుపై నడిపిస్తూ పోలీస్ స్టేషన్‌కు తరలించి, రౌడీ మూకలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు.

గత రాత్రి మచిలీపట్నంలోని గణేష్ భవన్ సమీపంలో కొందరు యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. అటుగా వెళ్తున్న పాదచారులపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా, సమీపంలోని సిటీ కేబుల్ కార్యాలయంపై కూడా దాడికి పాల్పడి హంగామా సృష్టించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఆర్ పేట సీఐ యేసుబాబు.. దాడికి పాల్పడిన బలరామునిపేటకు చెందిన ముగ్గురు యువకులను వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

నిందితులకు గుణపాఠం చెప్పేలా సీఐ యేసుబాబు వారిని సిటీ కేబుల్ కార్యాలయం నుండి కోనేరు సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. అంతేకాకుండా నిందితుల స్వస్థలమైన బలరామునిపేట వీధుల్లో కూడా వారిని నడిపించి స్థానికుల్లో భయం పోగొట్టే ప్రయత్నం చేశారు.

ALSO READ: Vicarabad News: వామ్మో.. ఉన్నట్టుండి కారులో పొగలు.. తృటిలో తప్పించుకున్న ఓ కుటుంబం

Advertisement

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×